వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశాడు. రాజమండ్రి సెంట్రల్ జైలులో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని శ్రీనివాస్ ఆరోపించాడు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న శ్రీనివాస్ తనపై జైలర్, జైలు వార్డెన్ దాడి చేశారనీ..చిత్ర హింసలకు గురిచేస్తున్నారనీ ఫోన్ ద్వారా తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో వారు ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం ఈ విషయాన్ని శ్రీనివాస్ కేసు వాదిస్తున్న లాయర్ అబ్దుల్ సలీం దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా శీ్నివాస్ తరపు లాయర్ అబ్దుల్ సలీం మాట్లాడుతూ..శ్రీనివాస్ ను జైలులోనే అంతంచేసేందుకు అధికారులు కుట్ర పన్నుతున్నారని అరోపించారు. శ్రీనివాస్ భద్రతపై న్యాయస్థానంలో పిటీషన్ వేస్తామని తెలిపారు. జైలులో జరిగిన దాడిలో శ్రీనివాస్ కు గాయాలయ్యాయనీ.. దీనిపై జైలు అధికారులపై సెక్షన్ 307 కింద కేసులు పెడతామని.. శ్రీనివాస్ కు రాజమండ్రి జైల్లో భద్రత లేదనీ.. విశాఖ జైలుకు బదిలీ చేయాలని కోర్టును కోరతామని సలీమ్ తెలిపారు.
కాగా..ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో 2018 అక్టోబర్ 25 జానిపల్లి శ్రీనివాస్ కోడిపందేలకు వాడే కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. పాదయాత్ర లో ఉన్న జగన్ విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వీఐపీ లాంచ్ లో ఉన్న జగన్ పై ఎయిర్ పోర్ట్ క్యాంటిన్ లో పనిచేస్తున్న శ్రీనివాస్ అన్నా అంటు వచ్చి సెల్ఫీ కావాలని అడిగి కోడి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది.ఈ కేసు అప్పట్లో పెను సంచలనం కలిగింది. ఈ కేసు ఇప్పటికే పలు మలుపులు తిరిగిన క్రమంలో రాజమండ్రి జైలులో ఉన్న శ్రీనివాస్ చేసిన ఈ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more