జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ రద్దు చేసిన నేపథ్యంలో ప్రపంచం ముందు దోషిగా నిలబడిన దాయాధి పాకిస్థాన్.. ఓ వైపు సరిహద్దు ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పోడుస్తూనే వుంది. అది చాలదన్నట్లు భారత్ లోకి అక్రమంగా ఉగ్రవాదుల చోరబాటును కూడా ప్రోత్సహిస్తోంది. ఇక ఆర్టికల్ 370 రద్దు తరువాత తమకు ప్రపంచ దేశాలను నుంచి సహకారం రాకపోయినా.. భారత్ పై మాత్రం ఎప్పటికప్పుడు విషాన్ని చిమ్ముతుంది.
ఓ వైపు తమ మంత్రులతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్న పాకిస్తాన్.. మరోవైపు అక్టోబర్ లేదా నవంబర్ లో యుద్దం కూడా జరగొచ్చని కవ్వింపు వ్యాఖ్యలు చేయిస్తోంది. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ సంయమనంతోనే వ్యవహరిస్తోంది. ఇక తాజాగా మన సహానాన్ని దాయాధి చేతకాని తనంలా భావిస్తోందా.? అంటే ఔననక తప్పదు. ఎందుకంటే పాకిస్తాన్ మరో దుందుడుకు చర్యకు పాల్పడింది. ఉపరితలం నుంచి ఉపరితలాన్ని గురిపెట్టే అణ్వాయుధ క్షిపణి ‘ఘాజ్నవి’ని ప్రయోగించింది.
గురువారం తెల్లవారు జామున ఈ పరీక్షను నిర్వహించినట్లు పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఇది ఛేదించగలదని వెల్లడించారు. పరీక్ష విజయవంతమైందని, పాక్ అధ్యక్షుడు, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ సందర్భంగా ఆర్మీని అభినందించారని ఆయన పేర్కొన్నారు. పరీక్షకు సంబంధించిన 30 సెకన్ల వీడియోను కూడా జత చేశారు.
Pakistan successfully carried out night training launch of surface to surface ballistic missile Ghaznavi, capable of delivering multiple types of warheads upto 290 KMs. CJCSC & Services Chiefs congrat team. President & PM conveyed appreciation to team & congrats to the nation. pic.twitter.com/hmoUKRPWev
— DG ISPR (@OfficialDGISPR) August 29, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more