ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. అందుకనే ఇక్కడి నుంచి రాజధానిని తరలించే విషయమై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతుందని రాష్ట్ర మంత్రి బొత్సా సత్యనారాయణ రగిల్చిన నిప్పు రాజుకుంది. అందుకు తన వద్ద ఆధారాలు కూడా వున్నాయని చెప్పిన ఆయన బీజేపి ఎంపీ సుజనా చౌదరి బంధువులకు చెందిన 124 ఏకరాల భూముల వివరాలతో పాటు బాలకృష్ణ చిన్నల్లుడి చెందిన కంపెనీకి కూడా 500 ఏకరాల భూమిని ధారాదత్తం చేశారని ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇక రాజధాని ప్రాంతం అమరావతి ఏర్పడిన తరువాత సీఆర్డీఏ ప్రాంతంలోకి దానిని కలిపారని బొత్స చేసిన ఆరోపణలపై బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ మండిపడ్డారు. మంత్రి బోత్స సత్యనారాయణ చేసిన అరోపణలు పూర్తిగా సత్యదూరమని ప్రకటించారు. రాజధాని అమరావతిపై బురద చల్లడానికి తనను వాడుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఆరోపణలు చేస్తే ఊరుకున్నానని... ఎన్నికల తర్వాత కూడా తనపై బురద చల్లడం సరికాదని అన్నారు. అమరావతికి 120 కిలోమీటర్ల దూరంలో గత ముఖ్యమంత్రి వియ్యంకుడికి స్థలాన్ని ధారాదత్తం చేశారని బొత్స ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శ్రీభరత్ మీడియాతో మాట్లాడుతూ, స్థలం ధారాదత్తం చేశారని బొత్స అసత్య ఆరోపణలు చేశారని అన్నారు. 2007లో కృష్ణా జిల్లా జయంతిపురంలో గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్ కోసం 498.39 ఎకరాలను తీసుకున్నామని తెలిపారు. బొత్స చూపించిన జీవో 2012 నాటిదని చెప్పారు. అప్పటికి తన వివాహం కూడా జరగలేదని... పెళ్లికి ముందు జరిగిన ఆ వ్యవహారాన్ని... తర్వాత జరిగిన పరిణామాలకు ముడిపెడుతున్నారని విమర్శించారు. తనను టార్గెట్ చేసి, వేలాది మంది రైతులకు అన్యాయం చేయవద్దని కోరారు.
దీనికి బదులుగా మళ్లీ మీడియా ముందుకు వచ్చిన బొత్సా.. ఆధారాలతో పాటుగా సుజనా కుటుంబానికి చెందిన ఆస్తుల చిట్టాను బయటపెట్టాడు. అయితే అన్ని ఇలా మీడియా ఎదుల బయట పెట్టడం బావ్యం కాదన్న ఆయన మచ్చుకు కొన్ని ఆస్తుల వివరాలను మీడియా సాక్షిగా ప్రకటించి.. బీజేపి నేతకు షాక్ ఇచ్చారు. ఒక్క సెంటు భూమి ఉందని నిరూపించాలన్న ఆయన సవాల్ ను చేతల ద్వారానే స్వీకరించిన బొత్సా ఏకంగా 124 ఏకరాల భూమికి సంబంధించిన రాజధాని భూముల వివరాలను బయటపెట్టారు. అంతేకాదు గత అధికార పార్టీ చేసిన కారుచౌకగా కట్టబెట్టిన భూముల వివరాలను కూడా వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more