పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు తర్వాత భారత్తో యుద్ధం జరిగే అవకాశముందని జోస్యం చెప్పారు. పాక్ రైల్వే మంత్రి వ్యాఖ్యలను అక్కడి మీడియా ప్రసారం చేసినట్లు జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. కార్గిల్ యుద్దం నేపథ్యంలో భారత సైన్యం చేతిలో చావుదెబ్బ తిన్న దాయాధికి ఇంకా బుద్దిరాలేదు. కేవలం సీమాందర ఉగ్రవాదం బలుపు చూసుకుని విర్రవీగుతున్న పాకిస్తాన్ భూభాగంలోకి చోచ్చుకెళ్లి సర్జికల్ దాడులు చేసి భారత సైన్యం సత్తా చాటినా.. ఇంకా తమ వద్ద ఏదో వుందని డాంబికాలకు పోతోంది.
డెబై ఏళ్లుగా శాంతి, సహనంతో వున్న భారత్.. వూల్వామా దాడులను తిప్పికొట్టేందుకు పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై గగనతలం నుంచి దాడులు జరిపి.. వందల సంఖ్యలో ఉగ్రవాదుల్ని బలితీసుకున్నా.. ఇంకా తమదే పైచేయి అన్నట్లు వ్యవహరిస్తోంది. భారత్ పై మరోమారు కయ్యానికి కాలుదువ్వేలా కవ్వింపు వ్యాఖ్యలు చేస్తోంది. ఇటీవల లండన్ లో తమ దేశానికి చెందిన ప్రత్యర్థి రాజకీయ నేతలను విమర్శలు చేసిన క్రమంలో జరిగిన పరాభవం సరిపోని ఈ అమాత్యులు.. కావాలనే భారత్ పై వ్యాఖ్యలు చేసి తన అవామీ ముస్లిం లీగ్ పార్టీ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు భారతీయుల్లో కలుగుతున్నాయి.
అంతకుముందు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆర్టికల్ 370ని భారత్ చట్టవిరుద్ధంగా తొలగించిందని..కశ్మీరీల హక్కుల కోసం ఎంత వరకైనా వెళ్తామని అన్నారు. అంతేకాదు ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్థ మేఘాలు కమ్ముకున్నాయని..అన్నింటికీ తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. ఇలా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో పాటు కేంద్రమంత్రులు సైతం నిత్యం భారత్ను రెచ్చగొడుతున్నారు. మరి పాక్ వ్యాఖ్యలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more