కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై దాఖలైన పిటీషన్లను విచారణకు స్వీకరించింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంతో పాటు జమ్మూకాశ్మీర్ ప్రాంతాన్ని ఢిల్లీ తరహాలో చట్టసభ వున్న యూనియన్ టెరిటరీగా చేయడంతో పాటు లడఖ్ ప్రాంతాన్ని అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చివేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జమ్మూకాశ్మీర్ సహా లడఖ్ ప్రాంతంలో పోలీసులు, భద్రతా దళాల బందోబస్తులోనే వుంది.
అయితే ఈ విషయంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రజలు, నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని విమర్శలు రేగాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తులు ఉన్న బెంచ్కి ఈ కేసును బదిలీ చేసింది. ఆర్టికల్ 370 రద్దు పట్ల మోదీ సర్కారుకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై కేంద్రం వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు.
ఏం చేయాలో తమకు తెలుసని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. అడ్వొకేట్ ఎంఎల్ శర్మ తొలి పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత జమ్మూ కశ్మీర్కు చెందిన లాయర్ షకీబ్ షబీర్ ఆయనకు జత కలిశారు. ఆగష్టు 10న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా పిటీషన్ దాఖలు చేసింది. ఇవే కాకుండా చాలా మంది ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ పిటీషన్లు దాఖలు చేశారు.
ఇప్పటి వరకూ జమ్మూ కశ్మీర్లో పర్యటించడానికి కేంద్రం రాజకీయ నేతలకు అనుమతించడం లేదనే సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రతిపక్ష నేతలతో కలిసి రాహుల్ శ్రీనగర్ వెళ్లగా.. విమానాశ్రయం నుంచే వారిని వెనక్కి పంపించారు. కాగా.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జమ్మూకాశ్మీర్లో పర్యటించేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ యూసఫ్ తరిగామీని కలిసేందుకు ఓకే చెప్పింది. కానీ ఈ పర్యటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more