కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యం బారినపడిన ఆయన ఆరోగ్యం శుక్రవారం రాత్రి నుంచి మరింత విషమించడంతో వైద్యులు తీవ్రంగా శ్రమించినా వారి ప్రయత్నాలు విఫలమై ఆయన కన్నుమూశారు. శ్వాసకోస వ్యాధితో భాధపడుతున్న ఆయన ఈ నెల 9న ఎయిమ్స్ అసుపత్రిలో చేరారు. ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతూ అస్పత్రిలో చేరారు. ఆయన మరణవార్తతో బేజేపి శ్రేణులు విషాదంలో మునిగారు. జైట్లీ మరణవార్తను ఎయిమ్స్ మీడియా, ప్రొటోకాల్ విభాగం అధికారికంగా ప్రకటించింది.
అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచారని ప్రకటించడానికి చింతిస్తున్నామని తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం 12.07 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని వెల్లడించింది. ఈనెల 9వ తేదీని జైట్లీ ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారని... సీనియర్ వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించిందని తెలిపింది. ఆయన చేరినప్పటి నుంచి నిలకడగా వుంటూ వైద్యుల చికిత్సలకు సహకిరిస్తున్న ఆయన శరీరం ఈ నెల 16న ఒక్కసారిగా విషమించింది. వైద్యుల చికిత్సతో కొలుకున్న ఆయన గత రాత్రి నుంచి మళ్లీ తీవ్ర అనారోగ్యం బారిన ఇవాళ మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్ అసుపత్రివర్గాలు తెలిపాయి.
ఆగస్టు 9 నుంచి అరుణ్ జైట్లీ అనారోగ్యంతో అస్పత్రిలోనే చికిత్స పోందుతున్నా.. ఆయన ఆరోగ్యంపై మాత్రం ఇప్పటి వరకు అసుపత్రి వర్గాలు ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. ఆయన మరణించిన విషయాన్ని మాత్రం ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. అరుణ్ జైట్లీ గతేడాది కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను కూడా చేయించుకున్నారు. అంతకుముందు 2014లో అరుణ్ జైట్లీ తన బరువును తగ్గించుకునేందుకు కూడా శస్త్రచికిత్సను చేయించుకున్నారు.
ప్రధాని నరేంద్రమోడీ హయంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన నాలుగుపర్యాయాలు విజయవంతంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గత ఏడాది అనారోగ్యం కారణంగా ఆయన బడ్జెట్ ను కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టలేకపోయారు. దీంతో జైట్లీ స్నేహితుడు, సహచర మంత్రి పీయూష్ గోయల్ అప్పట్లో బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆ తరువాత వచ్చిన సార్వత్రిక ఎన్నికలకు ఆయన దూరంగా వున్నారు. తన అనారోగ్యం నేపథ్యంలో తాను పోటీ చేయలేనని ఆయన ప్రధాని మోడీకి, బీజేపి అధ్యక్షుడు అమిత్ షాలకు విన్నవించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more