ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నివాసంలో చోరీ జరిగింది. గత రాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని కోడెల ఇంటికి చేరుకున్నారు. విద్యుత్ మరమ్మతు పనులు చేయాలంటూ లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లోంచి కంప్యూటర్లు పట్టుకుని పరారయ్యారు. గేటు వద్ద ఉన్న వాచ్ మన్ వారిని ఆపేందుకు ప్రయత్నించగా తోసేసి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
అయితే దొంగతనం కూడా రాజకీయం సంతరించుకుంది. బయటి వ్యక్తులు మరమ్మతుల పేరుతో కొడెల ఇంట్లోకి వెళ్లి కంప్యూటర్లను ఎలా తీసుకెళ్తారని, అయినా ఆ సమయంలో ఇంట్లని వ్యక్తులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ నుంచి ఫర్నీచర్ తరలిపు సందర్భంలో తాను కొంత ఫర్నీచర్ ను తన నివాసానికి తరలించానని, అందుకు ఎంత ఖర్చవుతుందో అంతా ఇచ్చేస్తానని చెప్పిన కోడెల ఆ సమాచారం ఎవరికీ అందకుండా కంప్యూటర్లను తనవారి చేతే దొంగతనం డ్రామాకు తెరలేపారా.? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
కాగా, ఈ సందేహాలపై కోడెల స్పందించారు. కొందరు వ్యక్తులతో పాటు కొన్ని మీడియా సంస్థలు తన ఇంట్లోని ఫర్నిచర్ చోరీ జరిగిందని, దుర్వినియోగం అవుతోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కోడెల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న ఫర్నిచర్ విషయంలో ఎటువంటి కంగారు అక్కర్లేదని, ప్రతి వస్తువుకు తనవద్ద లెక్క ఉందని తెలిపారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని ముందు నుంచీ చెబుతూ వస్తున్నానని, ఫర్నిచర్ కు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని, వాటిని అప్పగించడమా, డబ్బు చెల్లించడమా తేల్చిచెప్పాలని కోరానని గుర్తు చేశారు. అయినా కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more