ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీని విధించింది. బుధవారం రాత్రి హై డ్రామా నడుమ చిదంబరాన్ని అరెస్ట్ చేసిన సీబీఐ గురువారం ఆయన్ను సీబీఐ కోర్టు ముందు హాజరుపర్చింది. విచారణలో భాగంగా తాము అడుగుతున్న ప్రశ్నలకు చిదంబరం సమాధానాలు ఇవ్వడం లేదని, ఆయన తమకు సహకరించడం లేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఆయన్ను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ చేసుకున్న అభ్యర్థన పట్ల స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ కుహార్ సానుకూలంగా స్పందించారు.
ఆగష్టు 26 వరకు చిదంబరానికి సీబీఐ కస్టడీని విధించిన న్యాయస్థానం.. రోజుకు అర గంట సేపు కుటుంబ సభ్యులను లేదా తన లాయర్లను కలుసుకునే అవకాశాన్ని చిదంబరానికి కల్పించింది. ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చిదంబరం ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తారు. విచారణ కారణంగా చిదంబరం ప్రతిష్ట దెబ్బతినకుండా చూసుకోవాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా.. చిదంబరం తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, వివేక్ టంఖా వాదనలు వినిపించారు.
ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్ను పూర్తి స్థాయిలో బయటపెట్టడానికి చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకొని విచారించడం తప్పనిసరి అని తుషార్ మెహతా వాదించారు. ఈ కేసులో క్విడ్ ప్రొ క్రోను వెలికి తీయడానికి ఐదురోజులపాటు చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకోవడానికి సీబీఐకి అనుమతి ఇవ్వాలని కోరారు. కాగా న్యాయస్థానం అనుమతితో చిదంబరం మాట్లాడారు. గత 24 గంటలుగా తాను నిద్రపోలేదన్న ఆయన.. తనకు విదేశాల్లో బ్యాంక్ అకౌంట్ లేదన్నారు. ఆర్బీఐ అనుమతితో తన కుమారుడు కార్తీ విదేశాల్లో బ్యాంక్ ఖాతా తెరిచాడన్నారు.
కాగా, చిదంబరాన్ని సీబీఐ 12 ప్రశ్నలు అడిగిందని, వాటిలో ఆరింటికి ఆయన గతంలోనే సమాధానం ఇచ్చారని కపిల్ సిబల్ తెలిపారు. సీబీఐ కేసు మొత్తం ఇంద్రాణి ముఖర్జియా వాంగ్మూలం ఆధారంగానే ముందుకెళ్తోందని అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. అమె కేసులో నిందితురాలని, అమె అప్రూవర్ గా మారిందని చెప్పారు. అమె వాంగ్మూలాన్ని అప్రూవర్ గా పరిగణలోకి తీసుకోవాలే తప్ప.. సాక్షిగా కాదని, అయినా అదే జరుగుతుందని సింఘ్వీ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more