కృష్ణా జిల్లా విజయవాడలో ఏకంగా వంద గోవులు మరణం విషయంలో రాష్ట్ర పశు సంవర్థక శాఖకు చెందిన అధికారుల తీరు ఆగమ్యగోచరంగా వుంది. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలో 100 గోపులు మృత్యువాతపడ్డాగా, అందుకు ఫుడ్ పాయిజన్ మాత్రమే కారణమయ్యి వుండవచ్చునని గోశాల నిర్వాహకులు అనుమానించారు, కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం.. నిర్వహించారు.
ఇదిలా వుండగానే రంగంలోకి దిగిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు.. ఒక్కసారే 100 ఆవుల మరణం సంభవించడం వెనుక విష ప్రయోగం వుండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా, పశు సంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడు ఆధ్వర్యంలోని బృందం విచారణ చేపట్టింది. మేతలో విష ప్రయోగం జరిగిందనడంలో నిజం లేదని, గోవుల మృతికి టాక్సిసిటీ (విషపూరితం) కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు ఆయన తెలిపారు.
ఆవుల పోస్టుమార్టం నివేదిక మంగళవారం వస్తుందని దామోదర్ నాయుడు తెలిపారు. గోవులకు పెట్టిన మేతలోనే టాక్సిసిటీ ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. గోశాల నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు పేర్కొన్నారు. నివేదికలో పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నారు. గోవుల శరీరంలో అనేక చోట్ల రక్తపు చారలు కనబడ్డాయని డాక్టర్ దామోదర్ పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more