ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తమ జనసేన పార్టీ పరాజయానికి ప్రజల్లోకి చోచ్చుకెళ్లలేకపోవడం ఒక కారణంగా భావించిన పవన్ కల్యాణ్.. ఎన్నికల రణక్షేత్రంలో సమర్థతమైన నాయకుల లేమి కూడా కారణమని భావించారు. ఇక వీటితో పాటు మీడియా కూడా తమ ప్రచారాన్ని ప్రముఖంగా ప్రచురించకపోవడం, ఛానెళ్లు కవరేజీ చేయకపోవడం కూడా మరో కారణంగా జనసేనాని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దుకునే చర్యలను చేపట్టిన పవన్ కల్యాణ్.. మీడియా సంస్థలతో తనకున్న విభేధాలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వరుసగా ఏపీలోని పలు జిల్లాలో ముఖ్యనేతలతో జరుగుతున్న వరుస సమావేశాల నేపథ్యంలో ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో పాటు అతి విశ్వాసమే తమ కొంప ముంచిందని, జనంలోకి వెళ్లకపోవడమే పార్టీ ఓటమికి ప్రధాన కారణమని పవన్ భావిస్తున్నారు. దీంతో ఇకపై నిత్యం ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించారు.
ఇక ఎన్నికల సమయంలో జనసేనకు మీడియాలో అనుకున్నంత కవరేజీ రాలేదని పార్టీ నేతలతో పవన్ చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు ప్రధాన ప్రధాన మీడియా చానళ్లతో గొడవలే తమ పుట్టి ముంచాయని పవన్ భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు మీడియాపై యుద్ధం ప్రకటించిన పవన్ ఆ చానళ్లను బాయ్కాట్ చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. మీడియాకు తాను దూరం కావడానికి ఇదే కారణమని తెలుసుకున్న పవన్ ఇకపై మీడియాతో సఖ్యతగా ఉండాలని నిర్ణయానికి వచ్చారు. అన్ని చానళ్ల కార్యాలయాలకు వెళ్లి యాజమాన్యాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకునేందుకు పవన్ ప్రత్యేకంగా ఓ బృందాన్ని నియమించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more