ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా సెమీస్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. క్రికెట్ మ్యాచ్లు జరిగేటప్పుడు కెమెరాలు, ప్రేక్షకుల కళ్లు ఆటగాళ్లపైనే ఉంటాయి. ఆ మ్యాచ్కు ఎవరైనా సెలబ్రిటీలు వస్తే మాత్రం అటువైపు కూడా ఆకర్షణ ఉంటుంది. ప్రపంచకప్లో భారత్×బంగ్లాదేశ్ల మధ్య జరిగిన మ్యాచ్లో కెమెరాలన్నీ ఓ వ్యక్తిని ప్రధానంగా హైలైట్ చేశాయి. ఆమె సెలబ్రిటీ కాదు. అయినా, ఒక్కసారిగా కెమెరాలన్నీ ఆమె తనవైపు తిప్పుకొన్నారు. ఇంతకీ ఆ ప్రత్యేక అభిమాని ఎవరంటే 87 ఏళ్ల చారులత పటేల్. ఆటపై మక్కువ ఉంటే వయసుతో సంబంధంలేదని ఈ బామ్మ నిరూపించింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చిన్నపిల్లలకు ఏమాత్రం తగ్గకుండా బూర ఊదుతూ ఆమె చూపించిన జోష్కు అటు ఆటగాళ్లు, ఇటు కామెంటేటర్లు ఫిదా అయ్యారు. మరోవైపు బామ్మపై ప్రశంసలు కురిపిస్తూ టీమిండియా సారథి విరాట్ కోహ్లీకూడా ట్వీట్ చేశాడు.
Also would like to thank all our fans for all the love & support & especially Charulata Patel ji. She's 87 and probably one of the most passionate & dedicated fans I've ever seen. Age is just a number, passion takes you leaps & bounds. With her blessings, on to the next one. pic.twitter.com/XHII8zw1F2
— Virat Kohli (@imVkohli) July 2, 2019
‘ మ్యాచ్ గెలుపు సందర్భంగా అభిమానులందరూ తమ ప్రేమను, మద్దతును చూపినందుకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. ముఖ్యంగా చారులతాజీ కి. ఆమె వయసు 87. నేను చూసిన వారిలో క్రికెట్ అంటే అంత అభిరుచి ఉన్న అభిమాని ఈమే. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే. అభిమానానికి హద్దులుండవు. ఆమె ఆశీర్వాదంతో మరో మ్యాచ్కు ముందుకెళతాం’ అని ట్వీట్ చేసి ఫొటోలు పంచుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more