సౌత్ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం కియా కంపెనీకి సంబంధించి సెల్టోస్ ఎస్యూవీని ఇవాళ(20 జూన్ 2019) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే కియా మోటార్ భారతీయ మార్కెట్తో పాటు విడుదల చేయబోయే కియా సెల్టోస్ ఎస్యూవీ సంబంధించిన విశేషాలతో కూడిని వీడియోను విడుదల చేసింది. అయితే భారతదేశం నుండి తొలిసారి ఉత్పత్తి అవబోతున్న కియా బ్రాండ్ ఇది.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ప్లాంటులో సంస్థ సెల్టోలను తయారు చేస్తుంది. భారతదేశంలో ప్రవేశించిన తర్వాత, హుందాయ్ క్రీటా, జీప్ కంపాస్, మహీంద్రా XUV500 మరియు టాటా హారియర్ వంటి వాటితో కియా సెల్టోస్ పోటీపడుతోంది. ఇంతకు ముందు ఎస్పీ 2 ఐ అని పిలిచే కియా సెల్టోస్ ఇప్పుడు విడుదల చేస్తున్నారు. అధునాతన ఎస్పీ కాన్సెప్ట్ ఎస్యూవీ మోడల్ కారును గతేడాది అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం లాంఛనంగా ఆవిష్కరించారు.
అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద 'కియా మోటార్స్ ఇండియా' కంపెనీ ప్లాంట్లో ఈ కార్యక్రమం జరిగింది. కియా మోటార్స్కు ఆంధ్రప్రదేశ్లోని ప్లాంట్ 15వది. బిలియన్ డాలర్లు వెచ్చించి నిర్మించిన ఈ ప్లాంట్ నుంచి ఏడాదికి 3 లక్షల యూనిట్ల వాహనాల ఉత్పత్తి సామర్థ్యం ఉంది.యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో ప్రకారం.. టైగర్ ముక్కు గ్రిల్, సిల్వర్ క్రోమ్లతో ముందు బాగం హెడ్ల్యాంప్లు మరియు షార్క్ ఫిన్ యాంటెన్నాతో చూడడానికి చాలా ఎట్రాక్టివ్గా ఉంది.
డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి రియర్ టెయిల్ లాంప్స్ మరియు ఎల్ఇడి డిఆర్ఎల్లను కూడా వివరించింది. ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేతో కూడిన ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్ అప్ డిస్ప్లే, ఎంఐడి, 360 డిగ్రీల కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్ మరియు ముందు మరియు వెనుక సీట్ల కోసం హెడ్ రెస్ట్లు, బోస్ సౌండ్ సిస్టమ్ సెల్టోస్లో ఉన్నాయి. కియా సెల్టోస్ బిఎస్ VI కంప్లైంట్ 1.5 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లలో ఇది ఉంది. కియా సెల్టోస్ ధర రూ.10లక్షల నుంచి 16 లక్షల మధ్య ఉంటుందని అంచనా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more