రాములోరు కొలువుదీరిన పుణ్యక్షేత్రం భద్రాచలంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందా.. ఏపీకి ఇచ్చేస్తారా.. అన్న డిస్కషన్ నడుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణా దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భద్రాచలంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం ఎపీకి ఇవ్వాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్దలేదనీ భద్రాద్రి ఎపీకి ఇచ్చే విషయాన్ని కొట్టి పారేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల అభివృద్ధికి కలిసి పని చేస్తారని ఆయన పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం మునిగిపోతుందని, వెంటనే ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకెళ్లింది. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. భద్రాచలం కూడా మాదే అన్నారు. ఎన్నికల తర్వాత టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. భద్రాచలం టాపిక్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తూనే ఉంది. తెలంగాణలో ఉన్న భద్రాచలాన్ని త్వరలోనే ఏపీలో విలీనం చేయనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్టు, కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు ప్రచారం జరిగింది. ఇటీవల రాజ్భవన్లో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ సమావేశమైనప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని వార్తలు వచ్చాయి. విభజన చట్టం అంశాలు, రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారంపై చర్చ సందర్భంగా భద్రాద్రి విలీనాంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని సమాచారం. భద్రాద్రిని ఏపీలో కలిపేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారని చెప్పుకున్నారు. ఇంతలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more