రంజాన్ పర్వదినం నేపథ్యంలో ముస్లిం సోదరులు భక్తి ప్రవత్తులతో మసీదుకు వెళ్లి వస్తున్న క్రమంలో వారిని కారు బాంబు పేలుడు కబళించింది. ఈ ఘటనలో ఏకంగా 17 మంది ప్రాణాలను కోల్పోయారు. 30 సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా వుంది. ఈ ఘటన సిరియాలోని వాయువ్య ప్రాంతంలో అజాజ్ నగరంలో జరిగింది. నగరంలోని సెంట్రల్ సిటీ ప్రాంతంలో జనాలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో కారుబాంబును అమర్చిన ఉగ్రవాదులు సరిగ్గా నమాజ్ పూర్తిన తరువాత దానిని పేల్చివేశారు.
ఈ పేలుడులో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. మసీదు వద్ద నమాజ్ పూర్తైన తరువాత రోజాను వదిలేందుకు వీలుగా అక్కడే బోజనాలను ఏర్పాటు చేశారు. బోజనాల సందడిలో భక్తులు అక్కడకు చేరుకున్న సమయంలోనే ఈ దాడులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. రఖ్కా నగరంలోని కమాండ్ సెంటర్ దగ్గర కుర్ధిష్ నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్స్ కారు బాంబు పేల్చివేసిన ఘటనలో 10మంది చనిపోగా.. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే అజాజ్ నగరంలో కారుబాంబు పేలుడు ఘటన జరిగింది. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులం అని ఇప్పటివరకు ఏ సంస్థ కూడా ప్రకటించుకోలేదు.
At least 14 people were killed and 28 others sustained injuries after an explosive-laden car detonated in Syria's northwestern city of Azaz
— ANI Digital (@ani_digital) June 2, 2019
Read @ANI Story | https://t.co/IHOG1rjfME pic.twitter.com/R7whCFO67k
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more