కేంద్రంలో మరోమారు బీజేపి నేతృత్వంలోని ఎన్డీయే పార్టీ అధికారం అందుకునే దిశగా పయనం సాగిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ.. దేశవ్యాప్తంగా మూడువందల లోక్ సభ స్థానాలకు పైగా బీజేపి అభ్యర్థులు ముందంజలో వున్నారు. ఇక విజయాన్ని రమరమి దూసుకుపోతున్నారు. ఫలితాల సరళి పరిశీలిస్తే బీజేపి సొంతంగానే అధికారాన్ని అందుకునే దిశగా పరుగులు తీస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోనూ బీజేపి తన సత్తాను చాటింది. నరేంద్రమోడీ సర్జికల్ స్ట్రైక్స్ ప్రభావం దేశప్రజలను అకర్షితులను చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో గెలిచిన రాజస్తాన్; మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లోనూ బీజేపికి అనుకూలంగా ఓటర్లు తీర్పునిచ్చారు. ఆయా రాష్ట్రాల్లోనూ బీజేపి అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు. వీటితో పాటు కర్ణాటక, ఢిల్లీలలో బీజేపి అధిక్యం కనబరుస్తోంది. ఇదిలావుండగా, కాంగ్రెస్ కేవలం పంజాబ్, తమిళనాడులో ముందంజలో కొనసాగుతుంది. బీహార్ రాష్ట్రంలోని బేగుసరాయ్ నుంచి తన సమీప సీపీఐ ప్రత్యర్థి కన్నయ్యకుమార్ పై గిరిరాజ్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. ఢిల్లీలో నార్ ఈస్ట్ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై బీజేపి అభ్యర్థి మనోజ్ తివారి ముందంజలో వున్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో హమీర్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి అనురాగ్ ఠాకూర్ తన ప్రత్యర్థిపై 9,500 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ లో సునీల్ జాకర్ పై సినీనటుడు, బీజేపీ అభ్యర్థి సన్నీడియోల్ ముందంజలో ఉన్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో షీలాదీక్షిత్ పై బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ ఆధిక్యంలో ఉన్నారు. కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే 33, 222 ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు. టీఎంసీ అభ్యర్థిని మూన్ మూన్ సేన్ పై బీజేపీ అభ్యర్థి బాబుల్ సుప్రియో ముందంజలో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more