ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఏకపక్ష విజయం దిశగా దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. టీడీపీకి చెందిన మంత్రులను, సీనియర్ నేతలను కూడా తన ప్రభంజనంలో కోట్టుకుపోయేలా చేస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, ఏపీ ఐటీశాఖా మంత్రి నారా లోకేష్ కూడా వైసీపీ ఫ్యాను గాలికి అడ్రస్ గల్లంతయ్యేలా చేసింది. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను అకర్షించిన మంగళగిరి అసెంబ్లీ స్తానంలో అనూహ్య ఫలితాలు నమోదు అవుతున్నాయి. అక్కడ కూడా వైసీపీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం దిశగా దూసుకెళ్తున్నారు.
తాజాగా గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి, ఏపీ మంత్రి నారా లోకేశ్ పై వేల ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలోని 17 స్థానాల్లో వైసీపీ 9 చోట్ల, టీడీపీ 2 చోట్ల లీడింగ్ లో ఉన్నాయి. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం వైసీపీ 147, టీడీపీ 24, జనసేన 1 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. అలాగే లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 25 స్థానాలకు గానూ వైసీపీ 23 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుండగా, టీడీపీ రెండు స్థానాల్లో దూసుకుపోతోంది.
ఇక టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా వున్నవారు కూడా పరాజయం బాటలో కొనసాగుతున్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మంత్రి అయ్యన్న పాత్రుడు, మంత్రి నక్కా ఆనంద్ బాబు, సహా పలువురు మంత్రులు వెనకంజలో వున్నారు. ఇక టీడీపీ పార్టీ తరపును ప్రముఖులు కూడా ఐదవ రౌండ్ పూర్తేయ్యే వరకు వెనుకంజలో కొనసాగుతున్నారు. సీనియర్ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి తదితరులు కూడా వెనుకబడ్డారు. ఈ ఫలితాలతో నైరాశ్యంలో పడ్డ టీడీపీ నేతలు, ఇప్పటివరకు మీడియా ముందుకు కూడా వచ్చేందుకు సాహసించడం లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more