Man, cousin sisters tied to tree and thrashed ధార్ లో ఆటవిక రాజ్యం.. చెట్టుకు కట్టేసి చితకబాదిన వైనం..

Mp man elopes with married woman is tied to tree and thrashed

man tried to tree, dhar man tied to tree beaten up, dhar news, madhya pradesh news, madhya pradesh crime news, madhya pradesh police, couple beaten up in madhya pradesh, couple tied to a tree and beaten, pocso act, mp police, crime

A man and his two cousin sisters were tied to a tree and severely beaten for several hours by around nine persons in Madhya Pradesh's Dhar district after he allegedly eloped with a married woman,

ITEMVIDEOS: మధ్యప్రదేశ్ ధార్ లో ఆటవిక రాజ్యం.. చెట్టుకు కట్టేసి చితకబాదిన వైనం..

Posted: 05/16/2019 06:21 PM IST
Mp man elopes with married woman is tied to tree and thrashed

మధ్యప్రదేశ్ లో మరోమారు ఆటవిక రాజ్యం నడుస్తోందని మరో ఘటనతో నిరూపితమైంది. ఓ కుటుంబానికి ముగ్గురిని గ్రామస్థులు చెట్టుకు కట్టేసి గంటల తరబడి వారిని చేతికందిన వాటితో చావచితకబాదారు. వీరిలో ఓ చిన్నారి కూడా వున్నా కనీస కనికరం చూపించలేదు గ్రామస్థులు. ఇంత జరుగుతున్న గ్రామంలోని కొందరు మౌన ప్రేక్షకుల మాదిరి చోద్యం చూస్తున్నారే తప్ప.. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా వారిని విడిపించేందుకు ప్రయత్నించలేదు. ఇక గ్రామంలోని కొందరు యువకులు ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో బంధించేందుకు పోటీ పడ్డారే తప్ప.. దాడి చేస్తున్నవారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలోని అర్జున్ కాలనీలో జరిగింది. స్థానికంగా ఉండే ముఖేష్ అనే వ్యక్తి వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆ మహిళతో కలిసి పారిపోయాడు. దీంతో మహిళ భర్త ధహి పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత ముఖేష్ తో తన భార్య పారిపోవడానికి కారణంగా అనుమానిస్తున్న అతని సోదరుడి ఇంటికి వెళ్లి.. మిమల్ని పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెడతారని.. మర్యాదగా తన భార్య ఎక్కడుందో చెప్పాలని బెదిరించాడు. అప్పుడు ఇంట్లో మగవాళ్లు లేకపోవడంతో.. ఈ విషయంలో తమ ఇంటికి వస్తే రాజీ కుదుర్చుకుందామని, మీకు పోలీసుల భయం కూడా వుండదని చెప్పాడు.

దీంతో ధహి మాటలు విశ్వసించిన ఆ కుటుంబం, పోలీసుల బాధ పోతుందన్న యోచనతో తమ అన్నయ్య రాగానే అతనికి విషయాన్ని చెప్పి.. ధహి ఇంటికి తీసుకెళ్తారు. వారు రాగానే ధహి తన బంధువులను, ఇరుగుపోరుగులను పిలిచి వారి సాయంతో వారిని చెట్టుకు కట్టేసి.. వారిని చావచితకగొట్టారు. గంటల కొద్దీ సమయం గడుస్తున్నా.. ఒకరి తరువాత మరోకరు వారిపైబడి ఏకంగా తొమ్మిది గంటల పాటు వారిని చితకకొట్టారు. ఈ వీడియోలను నెట్టింట్లో అప్ లోడ్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి దాడి చేసిన వారిలో ఐదుగురిని అరెస్టు చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు. వీరిపై పలు సెక్షన్లతో పాటు పోస్కో చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles