మధ్యప్రదేశ్ లో మరోమారు ఆటవిక రాజ్యం నడుస్తోందని మరో ఘటనతో నిరూపితమైంది. ఓ కుటుంబానికి ముగ్గురిని గ్రామస్థులు చెట్టుకు కట్టేసి గంటల తరబడి వారిని చేతికందిన వాటితో చావచితకబాదారు. వీరిలో ఓ చిన్నారి కూడా వున్నా కనీస కనికరం చూపించలేదు గ్రామస్థులు. ఇంత జరుగుతున్న గ్రామంలోని కొందరు మౌన ప్రేక్షకుల మాదిరి చోద్యం చూస్తున్నారే తప్ప.. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా వారిని విడిపించేందుకు ప్రయత్నించలేదు. ఇక గ్రామంలోని కొందరు యువకులు ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో బంధించేందుకు పోటీ పడ్డారే తప్ప.. దాడి చేస్తున్నవారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలోని అర్జున్ కాలనీలో జరిగింది. స్థానికంగా ఉండే ముఖేష్ అనే వ్యక్తి వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆ మహిళతో కలిసి పారిపోయాడు. దీంతో మహిళ భర్త ధహి పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత ముఖేష్ తో తన భార్య పారిపోవడానికి కారణంగా అనుమానిస్తున్న అతని సోదరుడి ఇంటికి వెళ్లి.. మిమల్ని పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెడతారని.. మర్యాదగా తన భార్య ఎక్కడుందో చెప్పాలని బెదిరించాడు. అప్పుడు ఇంట్లో మగవాళ్లు లేకపోవడంతో.. ఈ విషయంలో తమ ఇంటికి వస్తే రాజీ కుదుర్చుకుందామని, మీకు పోలీసుల భయం కూడా వుండదని చెప్పాడు.
దీంతో ధహి మాటలు విశ్వసించిన ఆ కుటుంబం, పోలీసుల బాధ పోతుందన్న యోచనతో తమ అన్నయ్య రాగానే అతనికి విషయాన్ని చెప్పి.. ధహి ఇంటికి తీసుకెళ్తారు. వారు రాగానే ధహి తన బంధువులను, ఇరుగుపోరుగులను పిలిచి వారి సాయంతో వారిని చెట్టుకు కట్టేసి.. వారిని చావచితకగొట్టారు. గంటల కొద్దీ సమయం గడుస్తున్నా.. ఒకరి తరువాత మరోకరు వారిపైబడి ఏకంగా తొమ్మిది గంటల పాటు వారిని చితకకొట్టారు. ఈ వీడియోలను నెట్టింట్లో అప్ లోడ్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి దాడి చేసిన వారిలో ఐదుగురిని అరెస్టు చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు. వీరిపై పలు సెక్షన్లతో పాటు పోస్కో చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more