టీవీ9 యాజమాన్యం ఇవాళ్టి నుంచి అధికారికంగా తాము టేకోవర్ చేసుకున్నామని ఏబిసిఎల్ డైరెక్టర్ల ఒకరైన సాంబశివరావు తెలిపారు. ఈ మేరకు ఏబీసీఎల్ బోర్డు తరపున మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన టీవీ9లో తాము నలుగురు డైరెక్టర్లుగా వ్వవహరిస్తున్నామని చెప్పారు. తాము తొమ్మిది నెలల క్రితం అధికారికంగా ఏబిసిఎల్ లోని 90.5శాతం వాటాను కొనుగోలు చేశామని, ఆ తరువాత డైరెక్టర్లుగా నియమించకోవడంలో అనేక అవాంతరాలను ఎదుర్కోన్నామని అన్నారు. కాగా, వాటిన్నింటినీ అధిగమించి ఇవాళ టీవీ9 యాజమాన్యాన్ని కూడా తాము తమ అధీనంలోకి తీసుకున్నామన్నారు.
టీవీ9 వివాదం విషయమై ఈ బోర్డు తీసుకున్న కొత్త నిర్ణయాలను ప్రకటించారు. ఏబీసీఎల్ కంపెనీ ప్రతినిధులు. టీవీ9లో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చేందుకు అలందా మీడియా సంస్ధ మేనేజ్మెంట్.. అలందా మీడియా కలిసి సంయుక్తంగా సమావేశం నిర్వహించింది. సాంబశివరావు, జగపతిరావ్, శ్రీనివాస్, కౌశీక్ను డైరెక్టర్లుగా నియమితులయినట్లు బోర్డ్ డైరెక్టర్లలో ఒకరైన సాంబశివరావు వెల్లడించారు. అయితే ఏబీసీఎల్ మేనేజ్మెంట్ తమ నియామకానికి సంబంధించిన అనుమతులను ఆలస్యం చేసిందని అరోపించారు.
తమ నియామక పత్రాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ఆలస్యంగా పంపారని సాంబశివరావు అన్నారు. మార్చిలో ఇందుకు సంబంధించిన అనుమతి లభించిందని తెలిపారు సాంబశివరావు. బోర్డు మీటింగ్ పెట్టమని మూర్తిని, రవిప్రకాశ్ని అనేకమార్లు కోరాం అని అయితే వాళ్లు పెట్టలేదని సాంబశివరావు అన్నారు. రవిప్రకాశ్ని మూర్తిని వారి స్థానాల నుంచి తొలగించామని, టీవీ9 కన్నడ సీఈఓగా మహింద్ర మిశ్రాను, సీఓఓగా గొట్టిపాటి సింగారావును నియమించినట్లు తెలిపారు. అలాగే కంపెనీలో ఎవరైనా అవకతవకలు చేసి ఉంటే మేనేజ్మెంట్ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more