ప్రచండ భానుడి ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైబడి నమోదవుతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతల తీవ్రతతో భానుడు భగభగ మండుతున్నాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, రానున్న మూడు రోజుల పాటు ఎండలు మరింత తీవ్రంగా వుంటాయని అధికారులు భారత వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ఎండలో తిరగడం మంచిది కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఎండలు ధాటికి తెలుగు రాష్ట్రాల్లో మరణాలకు కూడా సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే భానుడి ప్రతాపానికి రెండు రాష్ట్రాల్లో 16 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎండ తీవ్రత ఈరోజు, రేపు కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్రమైన వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. ఇదే సమయంలో ఒక చల్లటి కబురు అందించింది. రానున్న నాలుగు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కాగా, నేడు, రేపు, ఎల్లుండి ఎండల తీవ్రతతో పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తత జారీ చేశారు. చిన్నారులు, వృద్ధులు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. రోహిణి కార్తె రాకముందే ఎండలు ఈ స్థాయిలో ఉన్నాయంటే.. ఇక కార్తె వచ్చినప్పుడు ఉష్ణోగ్రతలు ఎంతలా పెరుగుతాయన్న అందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇక ఖమ్మంలో 45.6 డిగ్రీలు, గుబ్బగుర్తి, సత్తుపల్లిలో 46.1, ఏన్కూరు, తిమ్మారావుపేటలో 45.7, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 46, జయశంకర్ జిల్లా మల్లూరులో 45.8, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.7, నల్గొండలో 44.8, ఆదిలాబాద్, నిజామాబాద్లో 43.8, హైదరాబాద్లో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more