ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏప్రిల్ 25న ఏర్పడే అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శ్రీలంకకు ఆగ్నేయంగా హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 36 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని తెలిపారు. ఇది శ్రీలంక తూర్పు ప్రాంతం మీద వాయవ్యదిశగా తమిళనాడు వైపు ప్రయాణిస్తుందని వివరించారు. అనంతరం 48 గంటల వ్యవధిలో తుఫానుగా మారుతుందని తెలియజేశారు. ఈ సీజన్లో ఏర్పడుతోన్న తొలి తుఫాను కాగా, దీనికి ఫణి అని నామకరణం చేశారు. బుధవారం కోస్తాలో ఒకట్రెండుచోట్ల ఉరుములు, మెరుపులు, అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక,
తెలంగాణలో అకాల వర్షాలు తగ్గిపోయాయని, బుధవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతారణ కేంద్రం అధికారులు తెలిపారు. గత మూడు రోజులుగా తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసి, ప్రచండ గాలులు వీచాయి. హైదరాబాద్ నగరంలో సోమవారం వీచిన ప్రచండ గాలులకు హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్లైట్ టవర్ కూలి ఒకరు మృతి చెందారు. మంగళవారం ఆదిలాబాద్లో అత్యధికంగా 42.3 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, హైదరాబాద్లో 37.8 సెల్సియస్ డిగ్రీలు నమోదయ్యింది. ఏప్రిల్ 24 నుంచి తెలంగాణ ప్రాంతంపై.. విదర్భ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల నుంచి వేడిగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి.
దీనికితోడు ద్రోణి బలపడి.. అల్పపీడనంగా మారే క్రమంలో.. ఏపీలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. తెలంగాణలో వేడిగాలులు, ఏపీలో ఉరుములు, మెరుపులతో గాలులు, చల్లటి వాతావరణం ఉండనుంది. వీటన్నింటికీ తోడు క్యుములోనింబస్ ప్రభావం కూడా ఉండనున్నాయి. ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల మేర పెరుగుతాయని అన్నారు. దీని ప్రభావంతో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more