సార్వత్రిక ఎన్నికల వేళ సరిగ్గా రెండో విడత పోలింగ్ కు ముందు చెన్నైలో భారీగా పట్టుబడిన బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినదని వాహన డ్రైవర్లు చెప్పడంతో.. ఈ విషయమై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. సమయంలో ఎందుకు తరలించారు. టీటీడీకి సంబంధించిన బంగారాన్ని ఎలా తరలిస్తారు? ఏ వాహనంలో తీసుకొస్తారు? అనే ప్రశ్నలు వినిపించాయి. ఇలాంటి వివరాలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని, పూర్తి బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంకుదేనని తిరుపతి దేవస్థానం ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. బంగారం పట్టుపడిన ఘటనపై క్లారిటీ ఇచ్చేందుకు ఆయన ప్రయత్నం చేశారు.
గోల్డ్ డిపాజిట్ స్కీం 2000 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. ఎస్బీఐలో 5,387 కిలోల బంగారం ఉంది. పీపీఎన్బీలో 1381 కిలోల బంగారం ఉంది. టీటీడీకి సంబంధించి మొత్తం 9,259 కిలోల బంగారం ఉంది. 2016 ఏప్రిల్లో పీఎన్బీలో 1381 కిలోల బంగారం వేశాం. అది 2019 ఏప్రిల్ 18కి మెచ్యురిటీ అయ్యింది. మెచ్యురిటీ అంశంపై మార్చి 27నే పీఎన్బీకి లేఖ రాశాం. బంగారం తరలింపు అంశం పూర్తి బాధ్యత పీఎన్బీదే. పీఎన్బీ వచ్చి ట్రెజరీలో ఇస్తే అది టీటీడీది అవుతుందన్నారు.
ఎన్నికల కమిషన్ సీజ్ చేసేటప్పుడు డాక్యుమెంట్లు ఉన్నాయని పీఎన్బీ మాతో చెప్పిందన్నారు టీటీడీ ఈవో... ఈసీ అధికారులకు డాక్యుమెంట్లు చూపామని ఫోన్లో చెప్పారు. వాళ్లు ఈసీకి ఎలాంటి డాక్యుమెంట్లు చూపారో మాకు తెలియదు. మేం మార్చి 27న లేఖ రాసేటప్పుడు ఏప్రిల్ 18న రావాలని చెప్పాం. ఏప్రిల్ 18కి బదులు ఏప్రిల్ 20న బంగారం అందజేశారు. బంగారం ఎలా తరలిస్తారో.. ఏ వాహనంలో తీసుకొస్తారో మనకెలా తెలుస్తుంది. బంగారం మాకు వచ్చేంత వరకు మిగిలిన విషయాలు అవసరం లేదు. బంగారం ఎలా వస్తే మాకేంటి? మాకు బంగారం అందిందా లేదా అనేది ముఖ్యం అన్నారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more