కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికలలో ప్రచారపర్వం ఇవాళ సాయంత్రానికి ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం పొలింగ్ కు అన్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో.. మరోవైపు ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 18న కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో సరిగ్గా సమయం చూసుకుని, అదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. సీఎం కుమారస్వామితో పాటు ఆయన సోదరులు మంత్రులు రేవణ్ణ, పుట్టరాజు సహా వారి అనుంగు అనుచరుల ఇళ్లపై కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
మాండ్య, హాసన్ నియోజకవర్గాల్లో అదాయపన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. జేడీఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. మందిర్, మదిర్ ప్రాంతాల్లోని నేతల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లకు పంచడానికి పెద్ద ఎత్తున డబ్బు సిద్ధం చేశారన్న సమాచారం రావడంతో దాడులు చేపట్టారు. గతంలోనే ఓ పర్యాయం మంత్రి రేవణ్ణ పుట్టణ్ణ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం రేవణ్ణ పుట్టణ్ణతోపాటు ఆయన అనుచరులు, బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఓటర్లకు అధికంగా డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. దేవేగౌడ మనువడు వంద కోట్ల రూపాయలను తన అనుచరుల ఇళ్లలో దాచి పెట్టాడని...అలాగే సుమలత రూ. 50 కోట్లు పంచేందుకు అక్కడున్నట్లు ఉదయం సమాచారం అందడంతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హాసన్ లో మూడు చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఐటీ దాడులు కక్ష్యపూరితంగా జరుగుతున్నాయని జేడీఎస్, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దేవేగౌడ మనుమళ్లు నిఖిల్ గౌడ, ప్రజ్వల్.. మాండ్య, హాసన్ నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచారు. అయితే వీరి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ వారిని గెలిపించుకునేందుకు సర్వశక్తులను ఓడ్డుతోంది. మరోవైపు మాండ్య నుంచి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత అంబరీష్ సతీమణి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. మాండ్య, హాసన్ నియోజకవర్గాల్లో నేటితో ప్రచారం ముగియనుంది.
ఇదిలావుండగా నిన్న కూడా ఐటీ అధికారులు దాడులు కొనసాగాయి. కన్నడ స్టార్ హీరో దర్శన్ కు చెందిన మైసూరు జిల్లా టి.నరసీపురలో ఉన్న దర్శన్ ఫాంహౌస్ పై నిన్న ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫాంహౌస్ లో ఉన్న అన్ని ప్రాంతాల్లో సోదాలు చేశారు. అయన మాండ్యా ఎన్నికల బరిలో నిలచిన నటి సుమలత తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జీఏ బావా నివాసంపై కూడా నిన్న రాత్రి ఐటీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎన్నికల వేళ జరుగుతున్న ఐటీ దాడులు కర్ణాటకలో కలకలం రేపుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more