బ్యాంకుల్లో సాదారణ ప్రజలు దాచుకున్న డబ్బును రుణాల రూపేణా వేల కోట్లను పోందిన పిమ్మట వారిని ఉద్దేశపూర్వకంగా ఎగొట్టి.. ఆర్థిక నేరాలకు పాల్పడి, దేశాన్ని విడిచి విదేశాలలో తలదాచుకుంటున్న వారి సంఖ్య ఒకటి రెండు నుంచి రెండెంకల స్థాయికి చేరిపోయింది. ఈ జాబితాలో వున్నవారు ఎవరంటే మనకు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వెల్లడించిన సంఖ్య తెలిస్తే షాక్ అవ్వకతప్పదు.
ఔనండీ దేశంలో అర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిన అర్థిక ఉగ్రవాదులు దేశాన్ని విడచి విదేశాలలో తలదాచుకుంటున్న వారి సంఖ్య ఏకంగా 36. నమ్మశక్యంగా లేదా.? ఈ గణాంకాలు ప్రత్యేక న్యాయస్థానంలో జస్టిస్ అరవింద్ కుమార్ సమక్షంలో జరిగిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో మధ్యవర్తిగా అరోపణలు ఎదుర్కోంటూ అభియోగాలు నమోదైన సుషేన్ మోహన్ గుప్తా బెయిల్ పిటీషన్ విచారణ నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ తెలిపిన వివరాలివి. పలు కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న 36 మంది వ్యాపారవేత్తలు దేశాన్ని విడిచి వెళ్లిపోయారని ఈడీ సంచలన విషయాన్ని వెల్లడించింది.
దేశాన్ని కుదిపేస్తున్న అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణం విచారణ సందర్భంగా... ఈ కేసులో అరెస్టైన సుషేన్ మోహన్ గుప్తా బెయిల్ పిటిషన్ పై ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ వాదనలను విన్నారు. ఈ సందర్భంగా సుషేన్ కు బెయిల్ ఇవ్వరాదని కోర్టును ఈడీ కోరింది. ఇతడిలా ఆర్థిక నేరాలకు పాల్పడిన 36 మంది ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారని తెలిపింది. సమాజంలో తనకు మంచి పేరు ఉందంటూ సుషేన్ బెయిల్ కోరడాన్ని తప్పుబట్టింది. మాల్యా, నీరవ్ మోదీలకు కూడా సమాజంలో మంచి పలుకుబడి ఉందని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Jan 27 | భాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా కొనసాగుతూ.. న్యాయస్థానంలో వున్న పెండింగ్ కేసుల విచారణకు గైర్హజరు అవుతున్న ప్రజాప్రతినిధులకు ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేసింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ ఎమ్మెల్యే ద్యాసం... Read more
Jan 27 | చిన్నారులకు సంబంధించి నేరుగా శరీరానికి శరీరం తాకితేనే అది పోస్కో చట్టం కింద లైంగిక వేధింపుల కేసుగా పరిగణించ బడుతుందని బాంబే హైకోర్టు వెలువరించిన వివాదాస్పద తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే... Read more
Jan 27 | జనసేన పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన చేప్పిన విషయాలు జనసేన కార్యకర్తలకు మంచి ఊపును అందిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ తరుణం వస్తుందా అని వేచి చూసిన... Read more
Jan 27 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శరవేగంగా ఎన్నికల పనులకు పూనుకున్నారు. సోమవారం... Read more
Jan 27 | ఫేస్ బుక్.. సామాజిక మాధ్యమ దిగ్గజం.. కోట్లాది మంది అకౌంట్ హోల్డర్లకు తమ భావాలను, అనుభవాలను, అనుభూతులను ప్రపంచానికి తెలియజేసే వేదికగా, గుర్తింపును తీసుకువచ్చే వారధిగా అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫేస్ బుక్... Read more