భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు సంవత్సరాదికి మధ్య చాలా తేడా వుంటుంది. న్యూఇయర్ రోజున అర్థరాత్రి వరకు మేల్కోని దీపాలను(క్యాండిల్స్) ను నోటితో ఊది మరీ సంబరాలను మొదలు పెడితారు.
కానీ తెలుగు సంవత్సరాది విశిష్టతే వేరు. ఈ రోజున వేకువ జామునే స్నానాదులు అచరించి.. ఇళ్లకు మామిడి, వేప తోరణాలను కట్టి.. షడ్రుచులతో పచ్చడి చేసి.. దేవుడి వద్ద దీపాన్ని వెలిగించి.. ఉగాది పచ్చడని దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తరువాత దానినే తొలిగా నోట్లోకి వేసుకుని సంబరపడతారు వేడుకలు నిర్వహించుకుంటారు హిందువులు. పిండివంటలు అరగించిన తరువాత సాయంత్రం ఆలయాలకు వెళ్లి ఈ ఉగాది నుంచి మలి ఉగాది వరకు తమ జాతక ఎలా వుందో పంచాంగ శ్రవణంలో విని శ్రావ్యానందం పోంతుతారు.
ఇంతకీ అసలు ఉగాది అంటే ఏమీటి.?
ఉగస్య ఆది క్రమంగా ఉగాదిగా మారింది. అదెలా అంటే.. "ఉగ" అనగా నక్షత్ర గమనము, దానికి 'ఆది' 'ఉగాది'. అనగా ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయినది. 'యుగము' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది కాబట్టి క్రమంగా యుగాది కాస్తా ఉగాదికా కాలక్రమణ చెందింది.
భారతీయ సనాతన ధర్మం అధునాతన జీవన విధానంలో సమన్వయం అయినా ఆ మార్పులలో కూడా ఇంకా ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు అచరిస్తూ.. ఆధ్మాత్మికంగా భక్తజనకోటి ముందుకు సాగుతుంది. దీంతో ఎన్ని మార్పులు వచ్చినా.. అమ్మలాంటి కమ్మదైనంతో కూడిన పండుగలు కోరితీసుకువచ్చే.. సంబరాలకు మాత్రం ఎప్పటీ కొదవ వుండదనే చెప్పాలి. ఉదాగి ప్రతీ ఏడాది చైత్ర శుక్ల పాడ్యమి నాడే వస్తుంది. అ రోజునే రోజున సృష్టి జరిగిందని పురాణైతికం.
ప్రచూర్యంలో వున్న ఉగాధి కథలు:
* మత్య్యావతారధారియైన మహావిష్ణువు వేదాలను హరించిన సోమకుని వధించి. ఇక వేదాలను పరిరక్షణంతా బ్రహ్మ దేపుడికి అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి.
* చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని, అందుచేత సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది అను పండగను అనవాయితీగా చైత్ర శుక్ల పాడ్యమి రోజున జరుపబడుచున్నదని కూడా చెప్పబడుచున్నది.
హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది పండగ పర్వదినాన్ని జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో ఈ పండగశోజ ఇంటింటా సంతరించుకుంటుంది. ఈ రోజున సాయంత్రం అలయాలకు వెళ్లే భక్తులు అక్కడ వేదపండితులు చేత చెప్పించబడే పంచాంగ శ్రవణాన్ని కూడా విని అనందిస్తారు. ఇది కూడా ఆనవాయితీగా వస్తుంది. ఆ సంవత్సరము లోని మంచి చెడులను, కందాయ ఫలములను, ఆదాయ ఫలములను, స్ధూలంగా ఆ ఏడాదిలో తమ భావిజీవిత క్రమము తెలుసుకుంటారు. ఎవరేనీ జాతకంలో ఫలితాలు అంత అశాజకంగా లేవో.. వారు తమ గ్రహశాంతి కోసం ఏం చేయాలన్న విషయాలను కూడా సూచిస్తుంటారు.
ఉగాది సంప్రదాయాను సారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది. రైతులతో పాటుగా తెలుగు వారు ప్రతిఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ మన ఉగాది-పర్వదినం. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం.
ఈ పండగ పర్వదినం రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటు స్నానం అచరించి, కొత్త బట్టలు ధరిస్తారు, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు."ఉగాది పచ్చడి" ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
ఇక ఈ సారి వచ్చే ఉగాది పండగ పేరు వికారి నామ సంవత్సరం. మొత్తంగా అరవై వుంటే తెలుగు సంవత్సరాలలో ఇది 33వ సంవత్సరం. శనివారం నాడు వస్తోందికాబట్టి.. వికారి నామ సంవత్సరానికి అధిపతి శని. ఇక మరీ ముఖ్యంగా ఇవాళ తలకు నూనె పట్టించి మరీ స్నానం అచరిస్తారు. నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి కొలువై వుంటారని ప్రతీతి. దీంతో ఆ ఇద్దరి దేవేరుల అనుగ్రహం భక్తులు పొందుతారని విశ్వాసం.
ఇది వికారి నామ సంవత్సరం కనుక " ఓం వికారి సంవత్సర దేవతాం సవిత్రే నమః" అని నమస్కారం చేసుకోవాలి. ఈ కొత్త తెలుగు సంవత్సరాది శనివారంతో ప్రారంభమవుతుంది కనుక ఈ సంవత్సరానికి శనిదేవుడు అరంభిస్తున్నాడు. కాబట్టి ఈశ్వరస్తుతి, శనిగ్రహ పారాయణం తదితర శ్లోకాలు చదువుతూ పూజ చేయాలి. అలాగే ఇష్ట దైవాన్ని పూజించుకోవాలి. షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి దేవునికి నివేదింయిర తరువాత దానితోనే రోజును ప్రారంభించడం అచారం. వికారి నామ సంవత్సరం మీకూ మీ కుటుంబసభ్యులకు సంతోషాలను, సిరి, సంపదలను, సకల కార్యాలను నిర్వఘ్నంగా అయ్యేలా చేయాలని అశిస్తూ, అకాంక్షిస్తూ.. తెలుగు విశేష్ తరుపున వికారి నామసంవత్సర శుభకాంక్షలు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more