పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తాను టీడీపీతో కలిశానని వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఈ ప్రచారం టీడీపీ నేతలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. వైసీపీ నేతలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇరు పార్టీలు కలిసి ఐదేళ్ల వయసున్న జనసేన అనే బిడ్డను కొడుతున్నారని పవన్ ఆరోపించారు. టీడీపీ, వైఎస్ఆర్సీపీలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ఆ ఇద్దరు కంసులకు జనసేనాని కృష్ణుడంటే భయం ఉంది. మన కురుక్షేత్రంలో ఇద్దరు కంసులను తలపడాలని జనసేనాని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
జనసేన వైఎస్ఆర్సీపీతో కలిసి వెళ్లలేదనేదే జగన్ బాధ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీతో కలిసి వెళ్తే బాగుంటుందని గతంలో తెలంగాణ నాయకులు తనతో చెప్పారని పవన్ తెలిపారు. వైసీపీతో తాను కలవకపోవడానికి జగన్ కుళ్లే కారణమన్నారు పవన్. సీఎం అంటే జగనే కావాలా? పవన్ కళ్యాణ్ సీఎం కావొద్దా? వైఎస్ కుటుంబీకులే సీఎం కావాలా? నారా వారి కుటుంబీకులే రాజకీయం చేయాలా? అని జనసేనాని ప్రశ్నించారు.
2009లోనూ ఇలాగే పనికిమాలిన దుష్ప్రచారం చేశారని పవన్ విమర్శించారు. జగన్ ఏడాదికొకరి చొప్పున నియోజకవర్గ ఇన్ఛార్జిలను మార్చి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ‘నేను మగాణ్ని.. ఏదైనా మాట్లాడితే దమ్ముగా బయటకొచ్చి మాట్లాడతాను. ఉద్యమాన్ని నడిపిన నాయకుడిగా కేసీఆర్ అంటే గౌరవం. కానీ జగన్లా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టలేను. బిస్కెట్లు పడేస్తే జగన్లా పడి ఉండాల్సిన ఖర్మ లేదు.
టీడీపీతో జతకట్టాల్సిన అవసరం లేద’న్న పవన్.. 2018లో టీఆర్ఎస్ తెలంగాణలో తెంచిన సైకిల్ చైన్ ను 2019లో తాము ఏపీలో కూడా తెంపేసామని పవన్ కల్యాణ్ అన్నారు. తాను వస్తే అధికారుల్లో అవినీతి ఉండదని జగన్ చెబుతున్నారు. రెండేళ్లు జైళ్లో ఉన్న జగన్ ఈ మాట చెబుతున్నారు. ఆయన వల్లే ఐఏఎస్ అధికారులు, మంత్రులు జైళ్లో ఉన్నారని పవన్ విమర్శించారు. అంటే ఆయన మాత్రమే అవినీతి చేస్తారా? ఇలాంటి వ్యక్తులు అవినీతి రహిత పాలన ఇస్తామంటే మేం నమ్మాలా? అని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more