కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీలకు చెందిన నేతల ఇళ్లు, కార్యాలయాల్లోనే ఐటీ సోదాలు నిర్వహిస్తున్నందుకు నిరసనగా బెంగళూరులోని అదాయపన్ను శాఖ కార్యాలయం ఎదుట కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి ధర్నా నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల వేళ ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే పశ్చిమ బెంగాల్ చేసినట్లే తామూ ఆ సంస్థలకు రాష్ట్రంలో ఉన్న అధికారాలను కత్తిరిస్తామని కుమారస్వామి చెప్పిన 24 గంటల్లోనే ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. దీనితో కుమారస్వామి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అదాయశాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
దీంతో ప్రధాన మంత్రి దేశంలోని ప్రతిపక్షాలపై కూడా స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన సంస్థలతో సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారని అరోపించారు. ‘ప్రధాన మంత్రి చేయాలనుకున్న నిజమైన సర్జికల్ స్ట్రైక్స్ ఇప్పుడు చేస్తున్నారు. ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీలకు చెందిన నాయకుల ఇళ్లపైనే ఐటీ సోదాలు చేస్తున్నారు. మోదీ ఆడుతున్న ఈ రాజకీయ చదరంగానికి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన ఐటీ అధికారి ఒకరు సహాయం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులను భయభ్రాంతులకు గురిచేయడానికి ప్రభుత్వ సంస్థలను, అధికారులను వినియోగించుకోవడం బాధాకరం’ అని ట్విటర్ వేదికగా అన్నారు.
ఈరోజు కర్ణాటక చిన్న నీటి పారుదల శాఖ మంత్రి సీఎస్ పుత్తరాజు, ఆయన బంధువులకు చెందిన ఇళ్లలో ఐటీ దాడులు జరిగాయి. ఐటీ అధికారులు నేరుగా సీఆర్పీఎఫ్ బలగాలను వెంటతీసుకుని వచ్చి దాడులు చేశారు. ‘ఈ దాడుల వల్ల భయపడేది లేదు. ఎన్నికల సమయంలో కావాలనే ఈ దాడులు చేయిస్తున్నారు. భాజపాకు చెందిన నేతల ఇళ్లలో ఎక్కడైనా ఇటువంటి ఐటీ దాడులు జరిగాయా?’ అని మంత్రి పుత్తరాజు ప్రశ్నించారు.
మాజీ ప్రధాని హెచ్.డీ.దేవెగౌడ తనయుడు, ముఖ్యమంత్రి కుమారస్వామికి సోదరుడు, ప్రజా సంబంధాలు, అభివృద్ధి శాఖా మంత్రి హెచ్.డీ. రేవణ్ణకు చెందిన ఇళ్లల్లో కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ దాడులపై కాంగ్రెస్ కూడా స్పందించింది. ‘స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఒక ప్రధానమంత్రి దుర్వినియోగం చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం’ అని ట్విటర్లో అరోపించారు. ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి దాడులు చేస్తున్న ప్రభుత్వం ఇదేనని చురకలంటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more