తెలంగాణ ముందస్తు ఎన్నికల నుంచి కాంగ్రెస్ కు దెబ్బమీద దెబ్బ తగులుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్ఎస్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలో మరింత దారుణంగా తయారైంది. టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగిన కీలక నేతలంతా గులాబి గూటికి క్యూ కట్టడంతో కాంగ్రెస్ అధిష్టానానికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. పార్టీలో వున్న పలువురు కీలక నేతలు పార్టీ మారుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని కాంగ్రెస్కు అధిష్టానానికి పెద్ద ఉపశమనాన్ని అందించాయి ఎమ్మెల్సీ ఎన్నికలు.
గత ఏఢాది డిసెంబర్ లో ముందస్తుగా వచ్చిన అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిన నేతలే ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ జాతకాన్ని మరోమారు పరీక్షించుకున్నారు. వారే ఏకంగా విజయాన్ని సాధించి ఎమ్మెల్సీ పీఠాన్ని అధిరోహించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊతం లభించినట్లైయ్యింది. ఈ ఎన్నికల్లో గెలుస్తామా? అని అనుమానంతోనే బరిలోకి దిగిన కాంగ్రెస్ ఖాతా తెరవడం సంచలనంగా మారింది. ఇక ఇప్పటికే పార్లమెంటు ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రచార జోరు పెంచింది.
ఈ సందర్భంగా కేటీఆర్ పలు సభల్లో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిన వ్యక్తులనే మళ్లీ పార్లమెంటు బరిలోకి దింపారని, భువనగిరలో చెల్లని రూపాయి నల్గొండలో ఎలా చెల్లుతుందని వ్యంగస్త్రాలు కూడా సంధిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఆ వ్యాఖ్యలు వారికే తిప్పికోట్టినట్లు చేసింది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికలలో చెల్లని రూపాయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలా చల్లిందని కాంగ్రెస్ నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పై సెటైర్లు వేస్తున్నారు.
కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి విజయం సాధించారు. సమీప టీఆర్ఎస్ ప్రత్యర్థి చంద్రశేఖర్ పై 39,430 ఓట్ల మెజారిటీతో జీవన్రెడ్డి విజయం సాధించారు. ఈ స్థానం నుంచి 17 మంది పోటీలో నిలవగా, మొత్తం 1,15,458 ఓట్లు పోలయ్యాయి. కాగా మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారానే జీవన్రెడ్డి విజయం సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం 14 టేబుళ్లపై 9 రౌండ్లలో అధికారులు ఓట్లు లెక్కించారు. పార్టీ నేతల ఫిరాయింపులతో సతమతమవుతున్న కాంగ్రెస్ కు జీవన్రెడ్డి విజయం కొత్త ఆశలు చిగురింపజేసిందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
ఇక నల్లగొండ-ఖమ్మం- వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఓటమి పాలయ్యారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన టీఎస్యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి సీపీఎం పార్టీ తరుపున పోటీ చేసిన విజయం సాధించారు. ఆయన పూల రవీందర్పై 2,829 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 20,888 వుండగా, ఎన్నికల్లో 18,885 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వీటిలో 858 ఓట్లు చెల్లనివిగా గుర్తించిన అధికారులు.. 18027 ఓట్లను పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో విజయానికి 9,014 ఓట్లు అవసరమని నిర్ధారించారు. కాగా, తొలి ప్రాధాన్య ఓట్లలో టీఎస్యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి 8,976, పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్కు 6,279 రాగా, ద్వీతీయ ప్రాధాన్యత ఓట్లుతో నర్సిరెడ్డి విజయం సాధించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more