గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తమతో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో లబ్ది పోందిన బీజేపి.. తమపై కక్షగట్టి రాష్టానికి నిధులు కేటాయించడం లేదని అధికార టీడీపీ పార్టీ గుప్పిస్తున్న అరోపణలు నిజమేనా..? రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించకుండా అన్యాయం చేసిన పార్టీ.. ఇప్పుడు బి టీమ్ గా వైసీపీ ముసుగులో రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని, ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇస్తున్న పిలుపులో నిజమెంత.? అంటే అవి పూర్తిగా నిజమనే స్పష్టం చేస్తుంది ఓ జాతీయ మీడియా.
వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపిల మధ్య రహస్య ఒప్పందం ఉందని.. ఈ సంగతి తమ స్టింగ్ అపరేషన్ లో వెల్లడైందని కూడా స్పష్టం చేసింది. స్వయంగా వైసీపీ ప్రతినిధే ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. ఏపీలో బీజేపీకి వైసీపీ బి టీం అనడంలో సందేహం లేదని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి కొన్ని స్థానాల్లో బీజేపీపై బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టాలని ఆ పార్టీతో ఓ అవగాహనకు వచ్చినట్టు విజయవాడకు చెందిన వైసీపీ అధికార ప్రతినిధి మనోజ్ కొఠారి న్యూస్ చానల్ ప్రతినిధికి చెప్పుకొచ్చారు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి విషయంలో తాము ఇంతకుముందు వారి అభ్యర్థులకు మద్దతు తెలిపినట్టు ఆయన వివరించారు. బీజేపీతో వైసీపీకి రహస్య ఒప్పందం ఉందని, ఇది వందశాతం నిజమని మనోజ్ చెప్పుకొచ్చారు. బీజేపీ కోసం వైసీపీ పనిచేస్తోందన్నారు. ఢిల్లీలో బుగ్గన బీజేపీ నేత రాంమాధవ్ను కలిశారు కదా? అన్న టైమ్స్ నౌ ప్రతినిధికి మనోజ్ బదులిస్తూ.. బుగ్గన విద్యావంతుడని, ఆయనెప్పుడూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడరన్నారు. బుగ్గన కలిశాకే రెండు పార్టీల మధ్య ఓ అవగాహన ఏర్పడిందా? అన్న ప్రశ్నకు ఆయన అవునని సమాధానమిచ్చారు.
రాష్ట్రంలో బీజేపీకి అభ్యర్థులే లేరు కదా? మరి, వైసీపీ అభ్యర్థులు ఎవరైనా బీజేపీ తరపున పోటీ చేస్తారా? అన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు మనోజ్ మాట్లాడుతూ.. అలా జరగదన్నారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనన్న ఆయన.. కన్నా లక్ష్మీనారాయణ వంటి వారిపై చాలా బలహీనమైన వ్యక్తులను నిల్చోబెడతామన్నారు. ఇదే పార్టీ నిర్ణయమని తేల్చి చెప్పారు.
అయితే, ఈ విషయంలో అధ్యక్షుడు జగన్ నుంచి డైరెక్టుగా ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు రాలేదని వివరించారు. జగన్తో ఎవరైతే నిత్యం టచ్లో ఉంటారో వారి నుంచే ఇటువంటి ఆదేశాలు వస్తుంటాయన్నారు. పెద్దిరెడ్డి వంటి వారు చెబుతుంటారని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయని మనోజ్ పేర్కొన్నారు. జగన్కు రాజకీయం అంటే ఏంటో నేర్పింది విజయసాయిరెడ్డేనని పేర్కొన్నారు. ఒకసారి జగన్ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు ఏమవుతారో అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more