విజయవాడ ప్రముఖ నాయకుడు వంగవీటి రాధా కృష్ణ టీడీపీలో చేరడం రమారమి ఖాయమైంది. ఇక కొందరు టీడీపీ నేతలు ఆయన చేరిక కేవలం లాంఛనంగానే మిగిలిందని పేర్కోంటున్నారు. వైసీపీ నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించి భగపడ్డ వంగవీటి రాధాకృష్ణ గత మూడు నాలుగు నెలలుగా రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ తీర్థం తీసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చినా.. తాను ప్రస్తతం తటస్థంగా వుంటానని, చెప్పిన వంగవీటి రాధా.. అన్ని పార్టీలలో తన తండ్రి రంగా అభిమానులు వున్నారని చెప్పారు.
కాగా, సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా షెడ్యూల్డు విడుదల కావడంతో అన్ని పార్టీలు వేగంగా పావులు కదుపుతూ తమ ఆదిపత్యాన్ని చాటుకుంటున్నాయి. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాధాను సోమవారం రాత్రి 12.30 తరువాత తర్వాత చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకు వచ్చారు. టీడీపీలో చేరిక పై రాధా చంద్రబాబు తో దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. వంగవీటి రాధాకు మచిలీపట్నం పార్లమెంట్ టికెట్ ఇచ్చే అవకాశాలను టీడీపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా అందుకు వంగవీటి సమ్మత్తిస్తారా.? లేదా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ కి రాజీనామా చేసిన రాధా చాలాకాలంగా టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతూ వస్తోంది.
వైసీపీ కి రాజీనామా చేసిన తర్వాత, టీడీపీ లో చేరాలంటే విజయవాడలో సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న కొండప్రాంత వాసులకు ఇళ్లపట్టాలు మంజూరు చేయాలని రాధా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రాధా పలు ప్రెస్ మీట్ లలో కూడా అదే డిమాండ్ చేస్తూ వచ్చారు. రాధా డిమాండ్ చేసిన కొన్నాళ్లకే ప్రభుత్వం కొండ ప్రాంత వాసులకు ఇళ్లపట్టాలు మంజూరు చేసింది. దీంతో తన తండ్రి చివరి కోరికను తీర్చిన పార్టీగా టీడీపీ ఉంది కనుక తాను టీడీపీ లో చేరేందుకు సిధ్దమయ్యానని తన కార్యకర్తలకు చెప్పినట్లు తెలిసింది. ఏది ఏమైనా చంద్రబాబు తో భేటీలో ఏఏ అంశాలు ప్రస్తావించారు, రాజకీయంగా ఎటువంటి హామీలు లభించాయనేది తెలియాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more