పుల్వామా దాడిపై ఆగ్రహంగా ఉన్న భారత్ సింధూ జలాల ఒప్పందం కింద దక్కిన నదీ జలాల్లోని మన వాటా నీటిని పాకిస్థాన్ కు ప్రవహించకుండా ఆపెయ్యాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాయాధి దేశం పాకిస్థాన్ దీనిపై భిన్నంగా స్పందించింది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తాము ఉగ్రవాద బాధితులమే అంటూ చేసిన వ్యాఖ్యలకు.. సింధూ నది జలాలపై స్పందించిన తీరుకు అసలు పొంతన లేకుండా వుంది.
ఉగ్రవాదులు పుల్వామాలో దుశ్చర్యకు పాల్పడి 40 మంది జవాన్ల ప్రాణాలను బలిగొన్న తరుణంలో.. ఇందుకు తమ దేశప్రజలు కూడా భారం మోయాల్సి వస్తుందని వ్యాఖ్యానించాల్సిన పాకిస్తాన్.. అందుకు భిన్నంగా ఉగ్రవాదులకు ఊతమిచ్చినట్లుగా.. వారి చర్యకు మద్దతు పలికినట్లుగా వ్యవహరించడం.. పలు ప్రశ్నలకు తావిస్తోంది. భారత్ నీళ్లు మళ్లించుకున్నంత మాత్రాన తమకు వచ్చిన నష్టమేమీ లేదని వ్యాఖ్యానించడం.. తమ దేశ ప్రేరేపిత ఉగ్రవాదులకు మరింత బలాన్ని అందించినట్లేనని భారతీయులు కామెంట్లు చేస్తున్నారు.
నదీ జలాలపై తాము ఎలాంటి ఆందోళనా చెందడం లేదని పాక్ నీటిపారుదలశాఖ సెక్రటరీ ఖవాజా షుమాలి వ్యాఖ్యానించారు. ఈ మేరకు పాక్ పత్రిక డాన్తో ఆయన మాట్లాడారు. ‘‘తూర్పు ప్రాంత నదుల జలాల్ని మళ్లించడంపై మాకు ఎలాంటి అభ్యంతరమూ, ఆందోళనా లేదు. భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల మేమేమీ చింతిండం లేదు. మేం ఉపయోగించుకునే సింధు, జీలం, చీనాబ్ నదీ జలాల నీటిని అడ్డుకుంటే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని అన్నారు.
ఈ మూడు నదుల నీటిని మళ్లించిన క్రమంలో తాము అభ్యంతరం వ్యక్తం చేస్తామన్నారు. 1960లో కూడా తూర్పు ప్రాంత నదుల జలాల్ని వారి కోసం మళ్లించుకున్నారు. ఆ సమయంలో మేమేమీ అభ్యంతరం చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారని.. దీంతో తమకేమీ ఇబ్బంది లేదని అన్నారు. దేశానికి సాగు, తాగు నీరు జాలాలు రావడంతో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా మార్చుకోవాల్సిన పాక్.. అందుకు బదులు తీవ్రవాదన్ని కోనసాగిస్తాం.. నీళ్లు అపితే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
సింధూ జల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్ నదులు పాక్ కు దక్కగా, రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్ కు దక్కాయి. పుల్వామా దాడి నేపథ్యంలో మనదేశంలోని తూర్పు ప్రాంతంలో ప్రవహించే నదీ జలాల్ని పాకిస్థాన్ కు వెళ్లకుండా నిలువరించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఆ నీటిని మళ్లించి జమ్ముకశ్మీర్, పంజాబ్ ప్రజలకు అందిస్తామన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more