కర్ణాటకలో బీజేపి అగ్రనేతలపై అధిష్టానం కత్తి పెట్టిందా.? ఎలాగైనా రాష్ట్రంలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపి ప్రభుత్వాన్ని నెలకొల్పాన్న వాంఛతో వుందా.? అందుకనే అక్కడ జరుగుతున్న బేరసారాలు, ప్రలోభాలు వెలుగులోకి వస్తున్నా.. వాటిపై కిమ్మనకుండా వుండిపోయిందా.? అంటే అవునన్న సంకేతాలే వస్తున్నాయి. అదిష్టానం అదేశాలతోనే రాష్ట్రంలోని బీజేపి అగ్రనేతలు శతవిధాలా ప్రయత్నాలు చేసి కుమారస్వామి ప్రభుత్వానికి కంటిమీద కునుకు కరువయ్యేలా చేస్తున్నారని విమర్శలు వినబడుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ పార్లమెంటు నిండు కొలువులో చెప్పినట్లు తమ ప్రభుత్వంలో ధర్మం, నీతి, న్యాయం నాలుగు పాదాలపై నడుస్తుందన్న మాటలు నిజమే అయితే.. వాటికి కర్ణాటకలో విఘాతం కలిగించే తన సోంత పార్టీ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కన్నడ నాట బీజేపి చేస్తున్న చర్యలు అక్కడి ప్రజల్లో బీజేపి పట్ల హేయభావం కలిగేలా చేస్తున్నాయన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా కేవలం అధికారమే పరమావధి అన్నట్లుగా.. ఎందుకు వ్యవహరిస్తుందో అన్న విషయం కూడా కన్నడిగులకు తెలిసిందే.
తాజాగా జేడీఎస్ - కాంగ్రెస్ కూటమిని గద్దెదించాలన్న ఉద్దేశంతో ప్రలోభాలకు దిగిన బీజేపీ నేతల ఆడియోలు ఇప్పుడు రాష్ట్రంలో కాక రేపుతున్నాయి. జేడీఎస్ ఎమ్మెల్యేలను యడ్యూరప్ప ప్రలోభ పెడుతున్న తాజా ఆడియో టేప్ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 8న ఓ ఆడియోను సీఎం కుమారస్వామి విడుదల చేయగా, ఈ తాజా టేపును జేడీఎస్ వర్గాలు బయటపెట్టాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే రూ. 10 కోట్లు ఇవ్వడంతో పాటు, ఆపై టికెట్ ఇచ్చి గెలిపించుకుని మంత్రి పదవి ఇస్తానని యడ్యూరప్ప ఆఫర్ చేస్తున్నట్టుగా ఇందులో ఉంది.
ఎమ్మెల్యే శరణగౌడతో మాటలకు దిగిన యడ్యూరప్ప, తొలుత మీ నాన్నతో మాట్లాడి రాజీనామాకు ఒప్పించాలని, ముంబైకి వెళ్లి, 15 మంది ఎమ్మెల్యేలను కలుపుకుని ఒకేసారి రాజీనామా చేస్తే, తొలుత ఇంటికి రూ. 20 కోట్లు పంపుతామని ఆయన చెప్పినట్టుగా వినిపిస్తోంది. ఆర్థిక వ్యవహారాలను తన కుమారుడు విజయేంద్ర చూసుకుంటాడని, లోక్ సభ ఎన్నికల తరువాత జేడీఎస్ కనిపించదని యడ్యూరప్ప అన్నట్టుగా ఉంది.
తాను రాజీనామా చేస్తే స్పీకర్ అంగీకరించకపోవచ్చని ఎమ్మెల్యే శివనగౌడ అభ్యంతరం చెప్పగా, దాని గురించి ఆలోచించ వద్దని, ఆ సంగతిని పెద్దలు చూసుకుంటారని భరోసా ఇచ్చారు. ప్రధాని, అమిత్ షా, గవర్నర్ లు మిగతా కథ నడిపిస్తారని అన్నారు. రాయచూర్ లో ఉన్న మార్వాడీల ద్వారా రూ. 20 కోట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆడియో టేపులు ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more