ప్రముఖ దర్శకనిర్మాత, రాజకీయ విశ్లేషకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనలో ఉత్పన్నమయ్యే వివిధ ప్రశ్నలు, అభిప్రాయాలను ఆయన తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా గత కొంత కాలంగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో గత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రుల ఆరాధ్యుడు ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని పదేపదే డిమాండ్ వస్తున్న క్రమంలో ఆయన సంచలన విషయాలను ప్రస్తావించారు.
ఎన్టీఆర్ తెలుగువారిని వదిలి 22 ఏళ్లు కావస్తున్నా ఆయనకు ఇప్పటి వరకు భారతరత్న అవార్డు దక్కకపోవడంపై అవేదన వ్యక్తం చేసిన ఆయన.. దానిని రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే అని అనుమానం కలుగుతుందంటూ.. అందుకు గల కారణాలను కూడా విశ్లేషించారు. ‘నా ఆలోచన’ అనే యూట్యూబ్ చానల్ లో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే రోజున ప్రకటించిన పురస్కారాల్లో ఎన్టీరామారావు పేరు లేకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని అన్నారు.
అయితే తనకు ఈ విషయంలో తనకు ఆయనపైనే అనుమానం ఉందని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లు ఎన్డీయేలో ఉన్న చంద్రబాబుకు భారతరత్న ఇప్పించడం పెద్ద విషయం కాదని తమ్మారెడ్డి పేర్కొన్నారు. అవార్డులు ప్రకటించేంత వరకు సైలెంట్ గా ఉండి, ఆ తర్వాత హడావుడి చెయ్యడం వెనక పెద్ద స్టోరీనే ఉందని అనిపిస్తోందని తమ్మారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తే కుటుంబం మొత్తం వెళ్లాల్సి వుంటుందని అన్నారు. కాగా ఢిల్లీకి వెళ్లడం అన్నగారి కుటుంబ సభ్యులకు పెద్ద విషయం కాదన్న ఆయన అక్కడే ఒక మెలిక వుందని గుర్తిచేశారు.
అదేంటంటే ఎన్టీఆర్ కు ఇచ్చే అవార్డును ఆయన సతీమణి లక్ష్మీపార్వతి అందుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ పురస్కారాన్ని లక్ష్మీపార్వతి అందుకోవడం ఇష్టం లేదని, అందుకనే కావాలనే ఈ విషయంలో చంద్రబాబు జాప్యం చేస్తున్నట్టు అనుమానంగా ఉందని పేర్కొన్నారు. భారతరత్న వద్దనుకుంటే దానిని అక్కడితో వదిలేయాలి కానీ ఈ రాద్ధాంతం ఎందుకని భరద్వాజ ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని చాలామంది బతుకుతున్నారని, కాబట్టి ఆయనను భ్రష్టుపట్టించవద్దని తమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more