దక్షిణాసియా దేశాల్లో అగ్రభాగన నిలిచిన చైనాను.. భారత్ అధిగమిస్తుందని పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు భారత రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. కాలక్రమంలో ఇది సాధ్యమవుతుందని అంటున్నారు ఆయన. దక్షిణాసియా దేశాల్లో ఆర్థిక వ్యవస్థల పరంగా చైనా నెంబర్ వన్ స్థానాన్ని అక్రమించిందని అయితే రానున్న కాలంలో క్రమంగా డ్రాగన్ దేశాన్ని భారత్ దాటేసే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశంలో రాజన్ పాల్గొన్నారు. ‘స్ట్రాటెజిక్ ఔట్లుక్ ఫర్ సౌత్ఏషియా’ అనే అంశంపై ప్రసంగిస్తూ.. ప్రస్తుతం చైనా వృద్ధి రేటు నెమ్మదిస్తుందని.. అదే సమయంలో భారత్ వృద్ధి రేటు క్రమంగా పెరుగుతూ వస్తోందని రాజన్ గుర్తుచేశారు. రాబోయే కాలంలో ఆర్థిక వ్యవస్థ పరంగా భారత్ మంచి స్థానంలో నిలుచుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.
భారత్ జీడీపీకి దాదాపుగా ఐదు రేట్లుగా వున్న చైనాను మనం దాటేయగలమా.? అన్న సందేహాలు అవసరం లేదని అన్నారు. 2017లో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2.59 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో భారత్ ప్రపంచంలో అతి పెద్ద ఆరో ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అయితే ఇదే సమయంలో చైనా జీడీపీ 12.23 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.
అయితే నెమ్మదిస్తున్న చైనా అర్థిక ప్రగతి.. ఒక కారణం కాగా. అదే సమయంలో క్రమంగా పెరుగుతున్న భారత అర్థిక వృద్దిని పరిశీలించిన తరువాతే తాను ఈ నమ్మకాన్ని వ్యక్తం చేశానని అన్నారు. చైనా, భారత్ దేశాల మధ్య పోటీ ఇరువురికీ ప్రయోజనం కలిగిస్తుందని తెలిపారు. నేపాల్, పాకిస్తాన్ తదితర దేశాల్లో మౌలిక ప్రాజెక్టులపై చైనా పని చేస్తోందన్నారు. భవిష్యత్తులో భారత్ కూడా ఈ స్థాయికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more