సామాన్యుల హక్కైన ఆధార్ కార్డుతో దేశపౌరుల వ్యక్తిగత సమాచారం పొందుపర్చని నేపథ్యంలో దీనిని గోప్యంగా ఉంచుకోవడం వారి ప్రాథమిక హక్కని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడిన విషయం తెలిసిందే, ఈ క్రమంలో అధార్ కార్డు వివరాలను కేవలం ప్రభుత్వ పథకాలకు మాత్రమే వర్తింపజేయాలని ఇది పథకాలు పక్కదారి పట్టకుండా చేస్తుందని కూడా అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. కాగా బ్యాంకులు, ప్రైవేటు టెలికాం సర్వీసుల ఎట్టి పరిస్థితుల్లో ఆదార్ వివరాలను సేకరించరాదని, ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని పూర్తిగా తొలగించాలని కూడా అదేశాలు జారీ చేసింది.
ఇక ఈ క్రమంలో ఇటు కేంద్రప్రభుత్వం కూడా ఆధార్ వివరాలు అడిగితే కోటి రూపాయల వరకు జరిమానా విధించేందుకు నూతన చట్టాన్ని కూడా తీసుకురానుంది. ప్రభుత్వ పథకాలకు కాకుండా మరే ఇతర సంస్థలు ఆధార్ కార్డు వివరాలు, లేక నెంబరు పోందుపర్చాలని బలవంతం చేసినా ఆయా సంస్థలకు కోటి రూపాయల వరకు జరిమానా విధించే కొత్త చట్టాన్ని కూడా తీసుకురానుంది కేంద్రం. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డును ఇకపై రవాణశాఖ అనుసంధానం కావాలని కొత్త ప్రణాళికతో ముందుకువస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ తో ‘ఆధార్’ అనుసంధానాన్ని తప్పనిసరి చేసే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.
106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్సీ) లో ఆయన మాట్లాడుతూ, ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంట్ లో పెండింగ్ లో ఉందని, త్వరలోనే లైసెన్స్ తో ‘ఆధార్’ అనుసంధానం తప్పనిసరి చేయబోతున్నామని అన్నారు. ‘ఆధార్’తో లైసెన్స్ అనుసంధానం వల్ల మంచి ప్రయోజనం వుందని, ఈ పద్ధతి అమల్లోకి వస్తే డూప్లికేట్ లైసెన్స్, నకిలీ లైసెన్స్ లకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. కాగా, పంజాబ్ లోని జలంధర్ లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో ఐఎస్సీ నిర్వహిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more