బీఫ్ వండుకున్నారనే కారణంగా గ్రామస్థులపై దాడులు చేయడం, బీఫ్ విక్రయిస్తున్నవారిని చితకబాదడం వంటి సంఘటనలు కొన్నిరోజుల కిందట వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే వాటన్నింటికీ విభిన్నమైనదీ సంఘటన. పెళ్లి విందులో ‘బీఫ్’ కచ్ఛితంగా వడ్డించాలని డిమాండ్ చేసినందుకు, వరుడితో వివాహాన్నే క్యాన్సిల్ చేసుకుందో వధువు. అలాగని ఆ అమ్మాయి హిందు కుటుంబానికి చెందినది కూడా కాదు. ఓ ముస్లీం యువతి. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ సిటీకి దగ్గర్లో ఉన్న సిసౌటా గ్రామానికి చెందిన అస్గర్ అలీ తన కూమార్తెను, అదే గ్రామానికి చెందిన నసీం అలీ కుమారుడైన నజీమ్కు ఇచ్చి నిఖా జరిపించేందుకు నిర్ణయించారు. నిశ్చితార్థం కూడా నిర్వహించి... వరుడికి ఉంగరం తొడిగి, పెళ్లి బట్టలు కూడా మార్చుకున్నారు. ఈ నెల 28న పెళ్లి జరిపించాలని నిఖాకి ముహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే పెళ్లి విందులో బీఫ్ పెట్టాలని వరుడు నజీమ్, వధువు కుటుంబీకులను డిమాండ్ చేశాడు. రూ. 5 లక్షలు కట్నం, కారు కట్నంగా ఇవ్వాలని కోరాడు.
కట్నం, కారు ఇచ్చేందుకు ఒప్పుకున్న వధువు కుటుంబం, బీఫ్ వడ్డించేందుకు మాత్రం ససేమీరా అనేసింది. అయితే బీఫ్ కచ్చితంగా ఉండాల్సిందే అని వరుడి కుటుంబం డిమాండ్ చేయడంతో... పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ప్రకటించింది వధువు. నిఖాకి ముహుర్తం పెట్టుకున్న తర్వాత వింత కోరికలు కోరిన వరుడి కుటుంబీకులపై వధువు తండ్రి అస్గర్ ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. యోగి ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్పై బీఫ్పై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని నజీమ్ కుటుంబీకులు చెబుతుండడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more