ప్రముఖ విమానయాన సంస్థలు ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలను అవమానపరుస్తున్నాయి. మొన్న పీవీ సింధూ, ఆ తరువాత జేసీ దివాకర్ రెడ్డి, అంతకుముందు శివసేన ఎంపీ.. విమానాల్లో కస్టమర్లు కొంచెం దురుసుగా ప్రవర్తించే వర్తించే ఫ్లయింగ్ రూల్స్.. సిబ్బంది, విమాన సంస్థల అలక్ష్యం, నిర్లక్ష్యంతో జరిగే తప్పిదాలకు వర్తించదేమన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. సెలబ్రిటీలు, ప్రముఖులకే ఇలాంటి ఘటనలు ఎదురైతే.. ఇక సర్వసాధారణ ప్రయాణికలును విమానయాన సంస్థలు ఎలా అటాడుకుంటాయో చెప్పనక్కర్లేదు.
ఆ మధ్యకాలంలో ఓ పెద్దాయన పట్ల విమానసిబ్బంది ప్రవర్తించిన తీరు.. పిడుగుద్దులను అందరూ చూశారు. అలాంటి దారుణాలు నమోదైతేకానీ మన కేంద్ర పౌరయాణశాఖ స్పందించదేమో అన్న సందేహాలు కూడా ప్రయాణికులలో రేకెత్తుతున్నాయి. తాజాగా జెట్ ఎయిర్ వేస్ లో ఎదురైన చేదు అనుభవాన్ని తన అభిమానులతో పంచుకుంది సినీ నటి కాజల్ అగర్వాల్. జెట్ ఎయిర్ వేస్ సంస్థ సహా సిబ్బందిపై కూడా అమె మండిపడింది. ప్రయాణికుల పట్ల చాలా దారుణంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ముంబై ఎయిర్ పోర్టుకు 75 నిమిషాల ముందుగానే తాము చేరుకున్నప్పటికీ కౌంటర్ స్టాఫ్ అయిన మోయిన్ అనే వ్యక్తి తమ సమయాన్ని వృథా చేశాడని ఆరోపించింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ టెర్మినల్ నుంచి డొమెస్టిక్ టెర్నినల్ వద్దకు విమానాన్ని తీసుకువచ్చి... మరో 30 నిమిషాల పాటు పార్క్ చేశారని మండిపడింది. గంటసేపు డోర్లను కూడా మూసి ఉంచారని మండిపడింది. ఎయిర్ వేస్ సిబ్బంది తీరుతో తామంతా ఎంతో ఇబ్బంది పడ్డామని తెలిపింది.
కాగా దీనిపై జెట్ ఎయిర్ వేస్ సంస్థ స్పందించింది. మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని అనాల్సిన చోట.. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం మిమల్ని త్వరలోనే కలుస్తామని స్పందించింది. జెట్ ఎయిర్ వేస్ స్పందన తీరుతో అగ్గి మీద గుగ్గులంలా మారిన కాజల్.. తనదైన శైలిలో బదులిచ్చింది. మీ పేవర్ కు అపాయింట్ మెంట్ ఇచ్చినందుకు ప్రియమైన జెట్ ఎయిర్ వేస్ కు ధన్యావాదాలు అని పేర్కోంది. ఉదయం నాలుగు గంటలకు జరిగిన ఈ ఘటనతో తన రోజు ఇంకా కాంతివంతమైందని స్పందించింది కాజల్.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more