టైమ్ బాగోలేకపోతే తాడును పట్టుకున్నా అది పామై కరుస్తుందన్నట్లు.. ఆ విద్యార్థిని విషయంలోనూ అదే జరిగింది. విధి వక్రీకరించింది. ఇంట్లో వుంటూనే పరీక్షలకు సిద్దం అవుతున్న ఆ రేపటి ఇంజనీరు పాలిట ఇంట్లోని ఫ్రిడ్జి డోర్ శాపంగా పరిణమించింది. ప్రిడ్జి డోర్ తీయగానే అది బాంబై పేలి.. విద్యార్థిని ప్రాణాలను బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని బొంగులూరు గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరుకు చెందిన మనోహర్, లావణ్యల పెద్ద కుమార్తె దీపిక బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ నెల 10న జరగాల్సిన మాధ్స్ పేవర్ 1ను ఈ నెల 31కి జేఎన్టీయూ అధికారులు పోస్టుపోన్ చేశారు. దీంతో మాథ్స్ పరీక్ష కోసం ఇంట్లోనే వుండి ప్రిపేర్ అవుతన్న దీపిక.. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకు, చెల్లెలు పాఠశాలకు వెళ్లిన తరువాత చదుపుకుంటుంది.
అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. తనకు దాహం వేయడంతో దీపిక ప్రీడ్జి డోర్ తీసింది. డోర్ అలా తీయగా.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు దెబ్బకు దీపిక ఎగిరిపడింది. ఆమెకు మంటలు అంటుకోవడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఫ్రిజ్ పేలడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడిపోయాయి. ఇంట్లో నుంచి పేలుడు శబ్ధం రావడంతో ఇరుగురుపొరుగువారు అక్కడికి పరుగులు తీశారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఫ్రిజ్లోని కంప్రెసర్తో పాటూ సిలిండర్ పేలడం వల్లే ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దీపిక మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు పంపించారు. ఇటు కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీపిక తల్లిదండ్రులది నల్గొండ జిల్లా దేవరకొండ కాగా.. బొంగులూరులో ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more