విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన గురువులూ తమ కూతుళ్ల వయస్సున్న వారిపై కామవాంఛతో తెగబడుతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. గురు దేవో మహేశ్వరహా: అంటూ గురువును దైవంతో సమానంగా పూజించే సంస్కృతి గల సమాజం మనదన్న విషయాన్ని కూడా మర్చిపోతున్న గురువు.. తమ విద్యార్థులను కోరిక తీర్చాలంటూ వేధించిన ఘటన విశాఖ జిల్లా యలమంచలిలో చోటుచేసుకుంది. హాస్టల్ లో ఉండి చదువుకుంటోన్న విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా ఎలమంచిలి రైల్వేస్టేషన్ రోడ్డులో గీతాంజలి డిగ్రీ, ఇంటర్ కళాశాలను నిర్వహిస్తున్నారు. దీని వ్యవస్థాపకుల్లో ఒకరైన పీవీఎస్ ఈశ్వరదత్తు ఈ కాలేజీకి ప్రిన్సిపాల్, సెక్రటరీగా ఉంటున్నాడు. డిసెంబరు12న రాత్రి సమయంలో కొంతమంది విద్యార్థినులను తన గదికి పిలిపించుకున్న ఈశ్వరదత్తు వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చమని, మాట వినకపోతే పరీక్షలో ఫెయిల్ చేయిస్తానని బెదిరించాడు.
అంతేకాదు తన మాట విని కోరికను తీర్చకపోతే భవిష్యత్తులో ఎక్కడా చదువుకోకుండా చేస్తానని వారిని ఈశ్వరదత్తు హెచ్చరించాడు. కీచక గురువు బారి నుంచి ఎలాగో తప్పించుకున్న విద్యార్థినులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. తీవ్ర మనోవేధనకు గురైన తమ పిల్లల పరిస్థితిని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ఎలమంచిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థుల ఏకాగ్రతను చెడగొట్టి మనోవేధనకు గురిచేసిన కీచక ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి లైంగిక వేధింపులు జరిగినట్టు నిర్థారించుకున్నారు. దీంతో ప్రిన్సిపాల్ ఈశ్వరదత్తును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై భారత శిక్షాస్మృతిలోని 354,354డి, పోక్సో 8, 12 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా అతడికి 15 రోజుల రిమాండ్ విధించారు. ఇదే అంశంపై విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన నిర్వహించి.. ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more