తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్టుపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్తాయిలో మండిపడింది. రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి బలవంతంగా పోలీసులు ఈడ్చుకుని వెళ్లారని ఆయన తరఫు న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణించిన న్యాయస్థానం అసలు రేవంత్ రెడ్డిని ఏ సాక్ష్యాధారాలతో అరెస్టు చేశారని ప్రశ్నించింది. కాగా, ఎక్కడికి తీసుకువెళుతున్నారో చెప్పకుండా కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురిచేశారని రేవంత్ తరపు న్యాయవాది తన పిటీషన్ లో పెర్కోన్నారు.
ఈ సందర్భంగా కోర్టు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి ఓ పార్టీ నేతను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ఏ ఆధారాలతో రేవంత్ ను అరెస్ట్ చేశారో చెప్పాలని న్యాయస్థానం కోరింది. దీంతో ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. రేవంత్ కారణంగా కొడంగల్ లో అల్లర్లు తలెత్తే అవకాశం ఉందని తమకు ఇంటెలిజన్స్ వర్గాల నుంచి నివేదిక అందిందని తెలిపారు. కొడంగల్ లోని కోస్గీలో ఈ రోజు జరిగే ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
వాదనలు విన్న ధర్మాసనం రేవంత్ రెడ్డిని ఎక్కడ ఉంచారో తెలపాలని ఆదేశించింది. అలాగే అల్లర్లపై ఇంటెలిజెన్స్ అందించిన నివేదికను తమముందు ఉంచాలని సూచించింది. అనంతరం విచారణను ఈరోజు మధ్యాహ్నం 3.45 గంటలకు వాయిదా వేసింది. కొడంగల్ లోని కోస్గీలో ఈరోజు సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభను అడ్డుకుంటామని రేవంత్ ప్రకటించడంతో అధికారులు ఆయన్ను ఇంటి నుంచి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. దీంతో రేవంత్ భార్య గీతతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఈ వ్యవహారంపై స్పందించిన తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్.. శాంతిభద్రతల సమస్య రావొచ్చన్న ఉద్దేశంతోనే రేవంత్ ను అరెస్ట్ చేశామన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అరెస్టుపై హైకోర్టులో ప్రత్యేక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని వెంటనే విడిచిపెట్టాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని రజత్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ పోలీసులు కోర్టుకు విన్నవించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more