ఆధార్.. ప్రతి భారత పౌరునికి వ్యక్తిగత గుర్తింపునిస్తుంది. సామాన్యుడి హక్కుగా తొలుత ప్రచారం జరిగిన ఈ కార్డు.. మన దేశంలో అన్నింటికీ అదే ప్రధాన ఆదారంగా మారింది. అయితే ఆధార్ వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగిస్తుందని పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని అశ్రయించాయి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అధార్ వ్యక్తిగత గుర్తింపు అని చెప్పిన న్యాయస్థానం.. దానిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టరాదని ప్రభుత్వాలను అదేశించింది.
వ్యక్తిగత గుర్తింపుకు సంబంధించిన సమాచారం గోప్యంగా వుంచాలని దేశఅత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించేవరకు.. మొబైల్ సిమ్ కావాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా, గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలన్నా, ఆస్తులు అమ్మాలన్నా, కొనుక్కోవాలన్నా ఆధార్ తప్పని సరిగా మారింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రజాసంక్షేమ పథకాలు పొందాలంటే మాత్రం ఆధార్ తప్పనిసరి అని కూడా న్యాయస్థానం వెలువరించింది. అయితే ప్రభుత్వాధికారుల నుంచి కూడా ఈ సమాచారం బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా న్యాయస్థానం సూచించింది.
దీంతో ఆధార్ మీద ప్రజల్లో అనేక సందేహాలు, అపోహలు ఏర్పడ్డాయి. ఆధార్ భద్రతపై భయాలు ఉన్నాయి. గోప్యంగా ఉంచాల్సిన వివరాలు ఈజీగా బయట లభ్యం అవుతున్న క్రమంలో తమ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం జరుగవచ్చని కూడా అందోళన వ్యక్తమవుతోంది. 500 రూపాయలకే ఆధార్ వివరాలు అమ్మేస్తున్నారని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఆధార్ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆధార్ వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టొద్దని, అన్నింటికి(టెలికాం కనెక్షన్లు, బ్యాంకు అకౌంట్లకు) ఆధార్ అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
దీంతో ఇప్పటికే అనేక కోట్ల మంది అధార్ డేటాను పోందిన టెలికాం సంస్థలు.. కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఆర్బీఐ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఆధార్ స్థానంలో ఆఫ్ లైన్ ఆధార్(క్యూఆర్ కోడ్) తీసుకురావాలని, ప్రూఫ్గా వాటిని అనుమతించాలని యోచిస్తున్నారు. దీని ద్వారా వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ క్విన్ రెస్పాన్స్ కోడ్ ను స్మార్ట్ ఫోన్ల ద్వారా అనుసంధానం చేసుకునే విధంగా బ్యాంకులు, టెలికాం సంస్థలు అర్బీఐకి సూచిస్తున్నాయి.
ఈ బ్యాంకు అకౌంట్లు, పేమెంట్ వ్యాలెట్లు, బీమా పథకాలకు.. ఆధార్ ఈ-కేవైసీ బదులు ఆఫ్లైన్ ఆధార్ వినియోగించాలని చూస్తున్నారు. క్యూఆర్ కోడ్ అంటే డిజిటల్ సంతకం అన్నమాట. ఆధార్ జారీ చేసే యూఐడీఏఐ సంస్థ పేరు మీద ఈ సంతకం ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్లను సెర్వర్లకు లింక్ చేసి ఉంచరు. దీంతో వ్యక్తిగత వివరాలు లీక్ అయ్యే ప్రమాదం ఉండదని రిజర్వ్ బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఆఫ్లైన్ ఆధార్ తీసుకొచ్చే విషయమై యూఐడీఏఐ అధికారులతో రిజర్వ్ బ్యాంకు అధికారులు చర్చలు జరుపుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more