పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ ఎగబాకే అవకాశం వుంది. ఏకంగా రికార్డు స్థాయి ధరలకు చేరిన ఇంధన ధరలు.. గత రెండు నెలలుగా క్రమంగా దిగివస్తుండగా, మళ్లీ ధరలు పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్ తాత్కాలికంగా వాయిదాపడటంతో.. ఇంధన ధరలకు రెక్కలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అర్జెంటీనాలో జరుగుతున్న జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు.. రానున్న 90 రోజుల పాటు తమ మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్దాన్ని వాయిదా వేసుకోవాలని అటు అమెరికా, ఇటు చైనాలు నిర్ణయించాయి.
దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలకు మళ్లీ డిమాండ్ పెరిగింది. ఈ నిర్ణయం అలా తీసుకున్నారో లేదో ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు సుమారుగా ఐదు శాతం మేర పెరిగాయి. అమెరికా టెస్ట్ టెక్సాస్ ఇంటెర్మీడియట్ (డబ్ల్యూటీఐ)లో క్రూడాయిల్ ధర బ్యారల్పై 2.45 డాలర్లు పెరిగి 53.38 డాలర్లుగా నమోదయ్యింది. ఇటీవల యాభై డాలర్లకు చేరిన క్రూడ్ అయిల్ ధర.. తాజాగా 53 డాలర్లకు పైగా చేరింది. క్రితం ముగింపుతో పోల్చితే బ్యారల్ క్రూడాయిల్ 4.8 శాతం పుంజుకుంది.
అటు అంతర్జాతీయ బ్రెంట్ క్రూడాయిల్ బ్యారల్పై 2.38 డాలర్లు పెరిగి 61.84 డాలర్లుగా ధర పలుకుతోంది. త్వరలో సమావేశం కానున్న ఒపెక్ దేశాల సమావేశంలో ఉత్పత్తిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయన్న కథనాలు కూడా ఇంధన ధరలు పెరగడానికి కారణం అవుతోంది. అమెరికా-చైనాలు ట్రేడ్ వార్ను వాయిదావేసుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధనానికి డిమాండ్ పెరగనుంది. ఇంధన అవసరాలకు ఎక్కువగా దిగుబడులపై ఆధారపడిన భారత్ సహా మిగిలిన దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముంది.
ఇదిలావుండగా, దేశీయంగా ఇవాళ పెట్రోల్ ధరలు తగ్గిస్తూ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 30 పైసలు తగ్గిన లీటర్ పెట్రోలు ధరరూ.71.93 కి చేరింది. డీజిల్ ధర 36 పైసలు తగ్గి రూ.66.66 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో 30 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.77.50 కి చేరగా.. డీజిల్ ధర 38 పైసలు తగ్గి రూ.69.77 కి చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 31 పైసలు తగ్గి రూ.76.26 ఉండగా.. డీజిల్ ధర 39 పైసలు తగ్గి రూ.72.42 గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర 31 పైసలు తగ్గి రూ.75.70ఉండగా.. డీజిల్ ధర 38 పైసలు తగ్గి రూ.71.46 వద్ద కొనసాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more