తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ప్రజాకూటమి అధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో తమ అఖిలభారత అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలసి సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతొలిసారి కలుసి సభావేదికను పంచుకున్న సందర్భంగా తాను షాక్ కు గురయ్యానని అంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సంచలన కామెంట్లు చేశారు. ఈ షాక్ నుంచి తేరుకునేందుకు తనకు ఒక రోజు పట్టిందని ఆయన తనదైన శైలిలో కామెంట్లు చేశారు.
రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఒంటరిగా పోటీ చేస్తే 40-50 సీట్లు కూడా రావని, అందుకనే చంద్రబాబు రాహుల్ ను కలిశారని పేర్కొన్నారు. అనంతపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన రఘువీరా.. రాహుల్ గాంధీ నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు. ఆయన నిర్ణయాన్ని తామందరం గౌరవించి.. దానికి కట్టుబడి ఉంటామన్నారు. అయితే జాతీయ స్థాయిలో దేశ ప్రయోజనా నిమత్తమే రాహుల్ చంద్రబాబుతో చేయి కలిపారని ఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగైదు నెలల్లో రానున్న సార్వత్రిక ఎన్నికలలో కూడా తాము అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి వుంటామని ఆయన చెప్పారు. టీడీపీతో పొత్తు అంశాన్ని కూడా రాహుల్కే వదిలేస్తున్నట్టు చెప్పారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా ముందుకెళ్లేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని రఘువీరారెడ్డి తెలిపారు. కాగా తెలంగాణలో ప్రజాకూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ వచ్చిన తరువాత ప్రజల్లో వారికి అధికారం అందించాలని బలంగా వుందన్నారు.
ఇక కేసీఆర్ తన ద్వందనీతికి ఆయన చేసిన వ్యాఖ్యలు నిదర్శమని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సందర్బంలో తెలంగాణ తల్లి అంటూ ప్రశంసించిన నోరే.. మూటలు అందడం లేదని అవేదనకు గురవుతున్నారా.. అందుకే మీ కడుపు తరుక్కుపోతుందా.? అని వ్యాఖ్యలు చేయడం ఆయన అధికార దాహానికి పరాకాష్ట అని రఘువీరా రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజానికానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేకరాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ తోనే న్యాయం జరిగింది, జరుగుతుందని కూడా రఘువీరారెడ్డి పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more