రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో విద్యుత్ బిల్లులు స్లాబ్ పద్దతి పోయి టెలిస్కోపిక్ పద్దతిలోకి వచ్చాయిని.. గతంలో వంద యూనిట్ల వరకు వున్న స్తామ్ ఇప్పుడు 101 యూనిట్ల నేపథ్యంలో ప్రజలు వంద దాటిన స్లాబును మెత్తంగా వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికలలో ప్రజా ఫ్రంట్ అధికారంలోకి వస్తే 100 యూనిట్ల లోపు విద్యుత్ ను ఉచితంగా ఇస్తామని ప్రజాఫ్రంట్ కన్వీనర్ కోదండరాం వెల్లడించారు. కొడంగల్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ సాధన కోసం పోరాడినట్లే.. రాష్ట్రం మేలు కోసం అంతా ప్రజా ఫ్రంట్గా ఏర్పడ్డామని తెలిపారు.
కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు కేసీఆర్ ప్రాజెక్టుల డిజైన్లు మార్చారని, ప్రజల కడుపు నింపేందుకు కాదని ఆరోపించారు. కేసీఆర్ ప్రజల చెవులో పూలు పెడుతున్నారని తెలిపారు. తెలంగాణ అంటే కేవలం కుటుంబం కాదు, తెలంగాణ అంటే ప్రజలు.. దేనికోసమైతే మనం తెలంగాణ రాష్ట్రాన్ని కలిసిగట్టుగా పోరాడి సాధించుకున్నామో.. ఆ లక్ష్యం నెరవేరాలంటే ప్రజా ఫ్రంట్ను గెలిపించండని కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రజాఫ్రంట్ అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల మహిళలకు లక్ష రూపాయల గ్రాంటు ఇస్తామని అన్నారు.
ప్రజా ఫ్రంట్ అధికారంలోకి వస్తే.. రూ.2 లక్షల రుణమాఫీ లభిస్తుందని, తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ అవుతాయని తెలిపారు. 100 యూనిట్ల వరకు కరెంటు ఉచితమని, 200 యూనిట్ల వరకు ఒకే రేటు ఉంచుతామని తెలిపారు. దీనికి తోడు నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామని చెప్పారు. ఈ హామీలు అమలవుతాయా లేదా అనే అనుమానం వద్దని కోదండరాం అన్నారు. ఈ హామీలన్నీ అమలు చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని, ఈ విభాగాన్ని తామే పర్యవేక్షిస్తామని తెలిపారు. ప్రజా ఫ్రంట్ను గెలిపించి.. కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపాలని ఆయన పిలుపునిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more