స్వయం ప్రకటిత దైవాంష సంభూతుడిగా ప్రకటించుకున్న ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన బంజారాహిల్స్ లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. సోమవారం అర్ధరాత్రి దోమలగూడలోని ఆశ్రయంలో గుండెపోటు రావడంతో బంజారాహిల్స్ లోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
బాల సాయిబాబా 1960 జనవరి 14న కర్నూలులో జన్మించారు. ఆయన తండ్రి రామనాథ శాస్త్రి కేరళ నుంచి కర్నూలుకు వలస వచ్చారు. బాల సాయిబాబాకు 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే కర్నూలులో తొలి ఆశ్రమాన్ని స్థాపించారు. కడుపులో నుంచి శివలింగాన్ని తీసే విద్య ద్వారా ఆయన ప్రాచుర్యం పొందారు. అయితే మధ్యలో కొంతకాలం బాల సాయిబాబా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనకు కర్నూలుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భక్తులు ఉన్నారు. శివరాత్రికి, సంక్రాంతికి బాల సాయిబాబా ఆశ్రమంలో జరిగే ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చేవారు.
బాల సాయిబాబా ఆధ్యాత్మికతతో ఎంతగా వార్తల్లో నిలిచారో.. అదేవిధంగా అనేక వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా ఉన్నారు. జన విజ్ఞాన వేదిక సభ్యులు ఆయనపై తీవ్ర విమర్శలు చేసేవారు. అదేవిధంగా ట్రస్ట్ పేరుతో భారీగా ఆస్తులు కూడగట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ సాయంత్రం నాలుగు గంటలకు ఆయన భౌతిక కాయాన్ని కర్నూలు తరలిస్తామని బాల సాయిబాబా అనుచరుడు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jan 21 | తెలంగాణ అధికార పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తనయ.. షేక్ పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డీలు పరస్పరం బంజారాహీల్స్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేసుకున్నారు. అదేంటి కేకే తనయ విజయలక్ష్మి... Read more
Jan 21 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలతో ఏకీభవించని న్యాయస్థాన ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనలను బలపరుస్తూ రాష్ట్రంలో... Read more
Jan 21 | టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కళా వెంకట్రావును అరెస్టు చేయలేదని, కేవలం విచారణకు మాత్రమే పిలిచామని విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారీ తెలిపారు. రామతీర్థాన్ని టీడీపీ నేతలు సందర్శించిన రోజున జరిగిన ఘటనపై... Read more
Jan 21 | అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రెండో పర్యాయం బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్ ను గణనీయమైన ఓట్లతో ఓడించి.. ఆయన... Read more
Jan 21 | దేశ రాజధానిలో తన సత్తాను చాటిన అమ్ ఆద్మీ పార్టీ రెండో పర్యాయం కూడా అధికారంలోకి రాకముందే అటు పంజాబ్, ఇటు హర్యానా సహా పలు రాష్ట్రాల్లోనూ సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించింది. పంజాబ్... Read more