ఓటు అమ్మకూడదు.. అలా అమ్మిన ఓటుకు విలువ మీకు ఐదేళ్ల శాపంగా మారుతుంది అని ప్రజా చైతన్య సంఘాలు, విద్యావంతులు, మేధావులు, ఓటర్లకు సూచిస్తుంటారు. అయితే ఎన్నికల బరిలో నిలబడే అదే విద్యావంతులు, మేధావులు, నిపుణులు గెలుపు కోసం ఎన్ని పాట్లు పడినా తప్పేంకాదంటున్నారు. ఎలా గెలిచామన్నది కాదన్నయ్య.. గెలిచామే లేదా అన్నదే ముఖ్యమంటున్నారు. అందుకు నోట కాదు నోట్ల కట్టలు పంచైనా విజయాన్ని సోంతం చేసుకుని అధికారాన్ని అనుభవించాలని భావిస్తున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా ఒక ఓటు కొనుగోలుకు అంత డబ్బు ఆఫర్ చేశారంటూ జరుగుతున్న ప్రచారం సంచలనం సృష్టిస్తోంది. ఇంతకూ ఒక్క ఓటు కోసం వారు ఆఫర్ చేసిన ఆ ధర ఎంతో తెలిస్తే ఎవరైనా దిగ్భ్రాంతి చెందవలసిందే. ఓటుకు రూ. కోటి!...అవునండీ అక్షరాలా ఒక్క ఓటుకు కోటి రూపాయలే. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఛైర్మన్ పదవికి తాము చెప్పిన వ్యక్తికి ఓటు వేస్తే రూ.కోటి ఇస్తామని ఆఫర్ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం న్యాయవాదుల్లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ఈ ఆఫర్ల ప్రచారంపై ఏకంగా కొందరు సీఎం కార్యాలయానికే ఫిర్యాదులు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ వ్యవహారంపై ఏసీబీతో విచారణ జరిపించాలని కొందరు తమ ఫిర్యాదుల్లో కోరారని తెలిసింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో...మొత్తం 23 వేలమంది న్యాయవాదులు ఓటింగ్ లో పాల్గొని 25 మంది సభ్యులను ఎన్నుకున్నారు. అనంతర దశలో ఈ పాతిక మంది సభ్యులు కలిసి బార్ కౌన్సిల్ కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ పదవికి భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలిసింది. ఇలా బార్ కౌన్సిల్ అధ్యక్షునిగా ఎన్నికైన వారికి ఐదేళ్లపాటు పదవీకాలం ఉంటుంది.
బార్ కౌన్సిల్ కు న్యాయవాదుల సంక్షేమ నిధి మంజూరు, న్యాయవాదుల దుష్పవర్తన ఆరోపణలు, న్యాయ కళాశాలలపై పర్యవేక్షణ వంటి పలు అంశాలపై విశేషాధికారాలు ఉంటాయి. ఇదిలావుంటే బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా ఒక్క ఓటుకు కోటి రూపాయలు ఆఫర్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై సాధారణ ప్రజానీకం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. కోటీశ్వరులు కావాలంటే వ్యాపారాలు చేయక్కర్లేదని...ఉద్యోగం చేస్తూ ఏళ్ల తరబడి కూడబెట్టక్కరలేదని...బార్ కౌన్సిల్ లో ఒక్క ఓటు ఉంటే చాలని చర్చించుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more