Will develop kukatpally on all fronts: Nandamuri Suhasini కూకట్ పల్లి నియోజకవర్గ అభివృద్దికి కృషిచేస్తా: సుహాసిని

Will develop kukatpally on all fronts nandamuri suhasini

NT RamaRao, Suhasini, Nandamuri Suhasini, Telangana TDP, kukatpally constituency, Hari Krishna, BalaKrishna, Kalyan Ram, Jr.NTR, Twitter, Chandrababu, Telangana, politics

Balakrishna Responds on Jr.NTR, Kalyan Ram election campaign for Nandamuri Suhasini in kukatpally assembly constituency and also appeals voters to elect suhasini.

ITEMVIDEOS: కూకట్ పల్లి నియోజకవర్గ అభివృద్దికి కృషిచేస్తా: సుహాసిని

Posted: 11/17/2018 01:36 PM IST
Will develop kukatpally on all fronts nandamuri suhasini

స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, నాన్న హరికృష్ణ, చంద్రబాబు, బాబాయ్ బాలకృష్ణ ఆశీస్సులతో తాను కూకట్ పల్లిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నందమూరి సుహాసిని తెలిపారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి అన్నివిధాలుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. కూకట్ పల్లిలో నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఆమె ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన అమె.. తనను కూకట్ పల్లి నియోజకవర్గం ప్రజలు అదరిస్తారని అశాభావం వ్యక్తం చేశారు. ప్రజాసేవ కోసం వస్తున్న తనను తెలుగు ప్రజలు ఆశీర్వదిస్తారని అమె ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసేవలో భాగంగా తనను అదరించే కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలకు తాను నిత్యం అందుబాటులో వుంటానని, ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అర్హులైన వారందరికీ అందేలా చూస్తానని చెప్పారు. నియోజకవర్గంలో ప్రజాకూటమి పక్ష నేతలందరినీ కలుపుకుని ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు.

హరికృష్ణ సోదరి లోకేశ్వరి మాట్లాడుతూ.. హరికృష్ణలాగే సుహాసినిది కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వమని చెప్పారు. కూకట్ పల్లి ప్రజలు నిండు మనసుతో తన కోడలిని ఆశీర్వదించాలని కోరారు. తమ్ముడు బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా నామినేషన్ సందర్భంగా తాను వెళ్లడం బాగా కలిసివచ్చి విజయం సాధించారని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు సుహాసిని నామినేషన్ సందర్భంగా తాను మరోసారి వచ్చాననీ, ఈసారి సుహాసిని కూడా ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

నందమూరి తారక రామారావు ఆశయసాధనతో.. చైతన్య రధసారధి హరికృష్ణ స్ఫూర్తి తో  ముందుకు సాగుతున్న టీడీపీ పార్టీలో నందమూరి వంశానికి చెందిన మూడో తరం కూడా రావడం సంతోషంగా వుందని టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తమ కటుంబంపై ప్రజలు ఎనలేని ఆదరణ చూపిస్తున్నారని.. సుహాసినిపైనా అదే ఆదరణ చూపించాలని కోరారు. నందమూరి వంశం నుంచి తొలిసారి ఓ మహిళ ఎన్నికల బరిలోకి దిగడం సంతోషకరమైన విషయమని బాలయ్య అన్నారు. సుహాసినిని అత్యథిక మెజారిటీతో గెలిపించాలని.. అదే హరికృష్ణకు నిజమైన నివాళి అని అన్నారు.

ఇక.. తెలంగాణలో మహాకూటమిదే విజయమని బాలయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ హైకమాండ్ అదేశం మేరకే కూకట్ పల్లి నుంచి నందమూరి సుహాసిని పోటీ చేస్తుందని చెప్పారు. ‘ఎన్టీఆర్’ బయోపిక్ షూటింగ్ లో తాను బిజీగా ఉన్నప్పటికీ వీలు చేసుకుని వచ్చానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని బాలకృష్ణ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఎన్నికల ప్రచారంలో పాల్గోంటారా.? అన్న ప్రశ్నకు బదులిస్తూ..ఎవరిష్టం వారిది.. వారి సినిమా షూటింగ్లో బిజీ షెడ్యూలుకు కొంత విరామం ఇచ్చి పాల్గోనే అవకాశాలు వున్నాయని అన్నారు.

ఇదిలావుండగా నందమూరి సుహాసినీని బరిలో దింపాలన్న అలోచన నుంచి దానిని కార్యరూపం దాల్చేవరకు టీడీపీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయమేనని పైకి చెబుతున్నా.. తెరవెనుక తతంగాన్ని నడిపించేది మొత్తం బాలకృష్ణ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య డైరెక్షన్ లోనే ఈ తతంగమంతా నడుస్తుందని, ఇందులో స్వామికార్యంతో పాటు స్వకార్యం కూడా దాగివుందని, అది కూడా త్వరలోనే బహిర్గతం అవుతుందన్న గుసగుసలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nandamuri suhasini  kukatpally  hari krishna  kalyan ram  Jr. NTR  Twitter  Telangana  

Other Articles