Nandamuri Suhasini feels proud to contest from TDP రేపు నామినేషన్ దాఖలు చేస్తా: నందమూరి సుహాసిని

Nandamuri suhasini feels proud to contest from tdp

NT RamaRao, Suhasini, Nandamuri Suhasini, Telangana TDP, kukatpally constituency, Hari Krishna, Kalyan Ram, Jr.NTR, Chandrababu, Telangana, politics

Nandamuri Suhasini says she feels proud to contest from her Grand father founded TDP, talking to media she also said that she files her nomination tomarrow ie saturday.

నామినేషన్ దాఖలు చేస్తా: నందమూరి సుహాసిని

Posted: 11/16/2018 07:56 PM IST
Nandamuri suhasini feels proud to contest from tdp

టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ముఖ్యమంత్రి, ఆంద్రుల అభిమాన నటుడు ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీ నుంచి తాను అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు తనకు ఎంతో గర్వంగా వుందని నందమూరి సుహాసిని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్నగారి చైతన్య రథసారథి నందమూరి హరికృష్ణ కూతురిగా, యావత్ తెలంగాణ ప్రజలను తనను ఆడపడచులా ఆశీర్వదిస్తారని మరీ ముఖ్యంగా కుకట్ పల్లి ఓటరు మహాశయులు, కూటమి పార్టీల కార్యకర్తలు తనకు అండగా నిలుస్తారని పేర్కోన్నారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వస్తున్నానని.. తాను కూడా ప్రజాసేవ చేయగలనన్న నమ్మకం, విశ్వాసంతో టిక్కెట్ కేటాయించి కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి బరిలో నిలిపినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలని నందమూరి సుహాసిని చెప్పారు. తాత ఎన్టీఆర్‌, తండ్రి హరికృష్ణ చిత్రపటాలకు నివాళులర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. శనివారం నామినేషన్‌ దాఖలు చేస్తానని సుహాసిని తెలిపారు.

రాజకీయాల్లోకి రావాలనే కోరిక తనకు చిన్నప్పటి నుంచీ ఉందని.. ప్రజలకోసం అనునిత్యం కష్టపడతానని చెప్పారు. ప్రముఖ సినీనటులు, సోదరులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఎన్నికల ప్రచారానికి వస్తారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అన్ని విషయాలపైనా రేపు నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత మాట్లాడతానని సుహాసిని స్పష్టం చేశారు. ప్రజలంతా తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఎన్టీఆర్‌ ఆశయాలకోసం సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారని నందమూరి రామకృష్ణ అన్నారు. హరికృష్ణ కుమార్తెను అందరూ ఆశీర్వదించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles