కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి ఓ ఈడీ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అంబిడెంట్ అనే కంపెనీని కాపాడటానికి గాలి 57 కేజీల బంగారం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా మరో ఈడీ అధికారికి రూ.కోటి లంచం ముట్టజెప్పినట్లు ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డిని విచారించేందుకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు యత్నిస్తున్నారు. కాగా, ఈ కేసులోఅరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు గాలి ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
బెంగళూరులో సెషన్స్ కోర్టులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని గాలి జనార్దన్ రెడ్డి తరఫు న్యాయవాదులు యాంటిసిపేటరీ బెయిల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు రాజకీయ దురుద్దేశంతోనే ఆయనపై కేసు దాఖలు చేశారనీ, ఇందులో తమ క్లయింట్ కు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు విన్నవించారు. ఆయనకున్న పాపులారిటీని, రాజకీయ ఇమేజ్ ను దెబ్బతీసేందుకే ఈ చర్యలని పిటీషన్ లో పేర్కోన్నారు.
అరెస్టు చేస్తారని మీరు ముందుగానే ఊహించుకుంటున్నారా ? అంటూ గాలి న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరుపై అభ్యంతరాలను వ్యక్తం చేసిన సీసీబీ పోలీసులకు.. అభ్యంతరాలు తెలుపుతూ కౌంటర్ పిటిషన్ దాఖలు చెయ్యాలని సూచించింది. అయితే ఈ బెయిల్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. అదే సమయంలో సీసీబి పోలీసులు గాలి జనార్థన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.
మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి కోసం నాలుగు బృందాలు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. రూ.600 కోట్ల కుంభకోణం కేసులో చిక్కుకున్న అంబిడెంట్ కంపెనీని ఈడీ విచారణ నుంచి కాపాడటం కోసం సెటిల్మెంట్ కు ప్రయత్నించి గాలి ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఏకంగా ఈడీకి చెందిన ఉన్నతాధికారితో రూ.18 కోట్ల మేరకు డీల్ కుదర్చుకుని.. అందులో కోటి రూపాయాలను అందించారు. కాగా ఈ కేసులో గాలి జనార్థన్ రెడ్డి దేశం దాటిపోకుండా ఇప్పటికే అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more