విశాఖపట్టణంలోని భూముల కుంభకోణం వ్యవహారంపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పేరు తెరపైకి వచ్చింది. ఈ భూముల కుంభకోణంలో ఏకంగా 300 మంది అక్రమాలకు పాల్పడినట్లు తేల్చిన సిట్ అందులో రాష్ట్ర మాజీ రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ధర్మాన ప్రసాద్ రావు కూడా వున్నట్లు తేల్చింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు రాజుకున్నాయి. ఈ భూముల కుంభకోణ వ్యవహారంపై విచారణ చేసిన సిట్ నివేదికను సమర్పించింది.
ఈ సిట్ నివేదకను ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముందు ఈ నివేదికను ఉంచారు. విశాఖ భూముల అవకతవకల్లో కొందరు ఐఏఎస్ లు, గ్రేడ్-1 అధికారుల హస్తముందని, కొందరు రాజకీయ నాయకులు, మాజీ మంత్రి ప్రమేయం కూడా ఉందని ఈ నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదికలో వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును పేర్కొన్నట్టు సమాచారం. ధర్మాన తనయుడి పేరిట ఉన్న భూముల పైనా సిట్ విచారణ జరిపింది.
మాజీ రెవెన్యూశాఖ మంత్రిగా ధర్మాన ప్రసాద్ రావు వ్యవహరించిన సమయంలో భూముల రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు కూడా అధికారులు నివేదికలో పోందుపర్చినట్లు సమాచారం. గతంలో విశాఖ జిల్లాలో పనిచేసిన ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్ కలెక్టర్లపై అభియోగాలు ఉన్నాయి. సిట్ నివేదికలో 10 మంది జిల్లా రెవెన్యూ అధికారులు, 14 మంది ఆర్డీవోల పేర్లు ఉన్నాయి. భూ అక్రమాల్లో స్థానిక రాజకీయ నేతల పేర్లను ఈ నివేదికలో పొందుపరిచారు.
100 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని, శాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని, కొందరు అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు పేర్కొన్నారు. కాగా, పదిహేనేళ్ల భూ లావాదేవీలపై సిట్ విచారణ జరిపింది. ఈ నివేదికపై తదుపరి చర్యలకు ఓ కమిటీని మంత్రి వర్గం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో లా, రెవెన్యూ, జీఏడీలకు చెందిన సెక్రటరీలు ఉంటారని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more