అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న క్రమంలో గ్రామాల్లో నేతల మధ్య కూడా విద్వేషాలు రగిలిపోతున్నాయి. ప్రశాంతతకు మారుపేరుగా వుండే తెలంగాణ జిల్లాల్లో కూడా ఫ్యాక్షన్ తరహా రాజకీయాలను నేతలు పెంచిపోషిస్తున్నారా.? అనే అనుమానాలు వచ్చేలా వికారాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ నేత హత్య జరిగింది. టీఆర్ఎస్ నేత నారాయణరెడ్డి ఇవాళ ఉదయం తన ఇంటి నుంచి పోలానికి వెళ్తున్న క్రమంలో ప్రత్యర్థులు చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని సుల్తాన్ పూర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులను అలుముకునేలా చేసింది. ఉదయం పొలానికి వెళ్తున్న నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు రాళ్లు, కర్రలతో కొట్టి చంపారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ దాడికి వెనుక వున్నది ఎవరని తేల్చేపనిలో పడ్డారు పోలీసులు. నారాయణరెడ్డి హత్య విషయం గ్రామంలోని ఆయన వర్గీయులకు తెలియగానే వారు ప్రత్యర్థి వర్గానికి చెందని నేతలపై దాడులకు పాల్పడ్డారు.
గత కొంతకాలం వరకు నారాయణరెడ్డికి ప్రధాన అనుచరులు సుభాష్ చందర్ రెడ్డితో పాటు ఆయన అనుచరుడి ఇంటిపైకి వెళ్లిన నారాయణరెడ్డి వర్గీయులు వారిపై దాడులకు పాల్పడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి.. కాంగ్రెస్ నేతలను రక్షించారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు. హతుడు నారాయణరెడ్డి గతంలో నార్మ్యాక్స్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
అయితే ఆ సమయంలో గ్రామంలోని కొందరు యువకులతో ఆయనకు గొడవలు ఏర్పడ్డాయి. మరోవైపు, నారాయణరెడ్డి అనుచరులు కొందరు ఇటీవల కాంగ్రెస్లో చేరారు. దీంతో ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా పరిస్థితి వేడెక్కింది. ఈ క్రమంలో నారాయణరెడ్డిని అంతం చేయాలని భావించిన ప్రత్యర్థులు ఉదయం పొలానికి వెళ్తున్న ఆయనపై రాళ్లు, కర్రలతో దాడిచేసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య గొడవలు జరిగి ప్రమాదం ఉందని భావించి.. ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో పోలీసుల్ని మోహరించారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ తో గ్రామస్థులు వణికిపోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more